Mohammed Shami: ప్రపంచకప్ ఓటమిపై షమీ ఎమోషనల్
ప్రపంచకప్ ఓటమి తర్వాత షమీ తొలిసారిగా స్పందించాడు. ప్రపంచకప్లో ఓడిపోవడంతో దేశం మొత్తం నిరాశకు గురైందని అన్నాడు.
- By Praveen Aluthuru Published Date - 02:46 PM, Thu - 28 December 23
Mohammed Shami: ప్రపంచకప్ ఓటమి తర్వాత షమీ తొలిసారిగా స్పందించాడు. ప్రపంచకప్లో ఓడిపోవడంతో దేశం మొత్తం నిరాశకు గురైందని అన్నాడు. ఆరంభం నుంచి ఎలా ఆడుతున్నామో, చివరి వరకు అదే జోరును కొనసాగించి ఫైనల్లో విజయం సాధించేందుకు 100 శాతం ప్రయత్నించాం. కానీ చివరికి ఎక్కడ తప్పు చేశామో ఖచ్చితంగా చెప్పలేమని, ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అని షమీ అన్నాడు.
ప్రపంచకప్ లో టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ విలయతాండవం చేశాడు. అనుకోకుండా జట్టులో స్థానం దక్కించుకున్న షమీ టోర్నీలో చివరి వరకు టీమిండియాకు అండగా నిలిచాడు. షమీ కేవలం 6 మ్యాచ్ ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడుసార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. సెమిస్ లో న్యూజిలాండ్ పై 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ప్రపంచకప్ చరిత్రలోనే 50కి పైగా వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ రికార్డులను షమీ సాధించాడు. మెగా టోర్నీ తర్వాత షమీ జట్టుకు దూరమయ్యాడు ఫిట్నెస్ కారణంగా షమీ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడు.
Also Read: Prabhas Salaar: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సలార్, 500 కోట్లతో భారీ వసూళ్లు
Related News
YS Sharmila: పులివెందుల సభలో స్పీచ్ మధ్యలో ఏడ్చేసిన వైఎస్ షర్మిల
ఏపీ రాజకీయంలో వైఎస్ షర్మిల సంచలనంగా మారుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్దిగా కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిల ప్రస్తుతం పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భాంగా ఆమె ఎమోషనలయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ సీఎం జగన్, మరియు వైఎస్ అవినాష్ రెడ్డిలపై ధ్వజమెత్తారు.