Kohli: విరుష్క జోడీ మళ్ళీ గుడ్ న్యూస్ చెప్పనుందా ?
ప్రస్తుతం సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తప్పుకున్నాడు.
- By Naresh Kumar Published Date - 04:16 PM, Tue - 14 June 22
ప్రస్తుతం సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తప్పుకున్నాడు. బ్రేక్ లేని క్రికెట్ ఆడుతున్న కోహ్లీకి బీసీసీఐ రెస్ట్ ఇవ్వడంతో సతీమణి అనుష్క శర్మ, కూతురు వామికాతో కలిసి అతడు వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్ళాడు. ఫ్యామిలీతో ఫుల్ రిలాక్స్ అయిన కోహ్లీ ముంబైకి తిరిగి వచ్చారు. అయితే వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన కొద్ది గంటల్లోనే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ హాస్పిటల్కు వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సోమవారం సాయంత్రం ముంబైలోని కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ వద్ద విరుష్క జోడి కన్పించారు. వీరిద్దరూ కారులో హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఓ ఫోటోగ్రాఫర్ వీడియో తీశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. దీంతో నెటిజన్లు అనుష్క శర్మ మళ్లీ ప్రెగ్నెంట్’. అనుష్క మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే
తాము హాస్పిటల్కు వెళ్లిన రీజన్ గురించి మాత్రం విరష్క జోడీ వెల్లడించలేదు. ఓ షాంపూ యాడ్ కోసం కలిసి నటించిన కోహ్లీ, అనుష్క.. ప్రేమలో పడి వివాహ బంధంతో ఒకటయ్యారు. అనుష్క గత ఏడాది జనవరిలో వామికాకు జన్మించింది. ఇదిలా ఉంటే గత కొద్దీ కాలంగా పేలవ ఫామ్ లో ఉన్న కోహ్లీ ఐపీఎల్ 15వ సీజన్ లోనూ పెద్దగా రాణించలేదు. దీంతో ఐపీఎల్ తర్వాత బ్రేక్ తీసుకున్న విరాట్ ఇంగ్లాండ్ టూర్ కోసం మళ్ళీ జట్టుతో కలవనున్నాడు.
Related News
Bengaluru Win: సన్రైజర్స్ జోరుకు బ్రేక్ వేసిన ఆర్సీబీ.. ఎట్టకేలకు రెండో విజయం నమోదు చేసుకున్న బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.