IPL TV Ratings: బీసీసీఐకి షాక్ ఇచ్చిన ఐపీఎల్ రేటింగ్స్
ఐపీఎల్ 2023 నుంచి 2027 మధ్య కాలానికి సంబందించిన మీడియా రైట్స్ కోసం బీసీసీఐ మరి కొద్ది వారాల్లో వేలం నిర్వహించనుంది.
- By Naresh Kumar Published Date - 05:48 PM, Sat - 9 April 22
ఐపీఎల్ 2023 నుంచి 2027 మధ్య కాలానికి సంబందించిన మీడియా రైట్స్ కోసం బీసీసీఐ మరి కొద్ది వారాల్లో వేలం నిర్వహించనుంది. ఈ వేలంలో ఈ సారి బడా కంపెనీలు పోటీపడబోతున్నాయి. 2023 నుంచి 2027 మధ్య కాలంలో ఐపీఎల్ మీడియా హక్కుల కోసం యాపిల్ కంపెనీ, టీవీ 18 , డిస్నీ, సోనీ, జీ, అమెజాన్ వంటి కంపెనీలు ఇప్పుటికే టెండర్ దాఖలు చేశాయి. అయితే ఈ ఐపీఎల్ 2023-2027 మీడియా రైట్స్ టెండర్కు ముందు బీసీసీఐకి ఊహించని షాక్ తగిలింది.
15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ 2022 సీజన్ వ్యూయర్ షిప్ సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. ఐపీఎల్ 2021 సీజన్ తో పోల్చుకుంటే ఐపీఎల్ 15 వ సీజన్ తొలి వారం వ్యూయర్ షిప్ సంఖ్య 33 శాతం తగ్గిపోయింది. గతేడాది తొలి 8 మ్యాచ్లకు 3.75 టీవీ రేటింగ్ లభించగా.. ఈసారి ఐపీఎల్ లో తొలి 8 మ్యాచ్లకు 2.52 టీవీ రేటింగ్ మాత్రమే లభించింది. అంతకుముందు ఐపీఎల్ 2020 సీజన్ లో తొలి వారం మ్యాచ్లకు 3.85 టీవీ రేటింగ్ లభించింది. అయితే ఐపీఎల్ 2023-2027 మీడియా హక్కుల ద్వారా సుమారు రూ. 50 వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోన్న బీసీసీఐకి ఇది గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఇదిలాఉంటే.. ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం పోటీలో ఉన్న అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంఎంతమొత్తమైన చెల్లిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది . ఇక జూన్ రెండో వారంలో మీడియా రైట్స్కి సంబంధించిన వేలం నిర్వహించనుంది.
Related News
T20I Player Rankings: టీ20 ర్యాంకింగ్స్లో టాప్లో సూర్యకుమార్ యాదవ్..!
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో భారత పేలుడు బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.