IPL Auction Venue: సింగపూర్ వేదిక ఐపీఎల్ మెగా వేలం..?
నవంబర్ చివరిలో జరగనున్న IPL 2025 మెగా వేలానికి సింగపూర్ను వేదికగా BCCI పరిశీలిస్తోంది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియాలోని ఒక నగరాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
- By Gopichand Published Date - 06:11 PM, Sun - 13 October 24

IPL Auction Venue: ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని దేశాల ఆటగాళ్లు కలిసే ఈ లీగ్కు ప్రపంచలోనే అత్యంత ఆదరణ ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఫోర్లు, సిక్సర్ల మోతతో స్టేడియాలు సందడిగా మారతాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మొత్తం 10 జట్లు పోటీపడుతుంటాయి. టైటిల్ కోసం అన్ని జట్లు హోరాహోరీగా పోటీపడతాయి. తమ అభిమాన ఆటగాడి ఆట కోసం అభిమానులు సైతం వెయ్యి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఐపీఎల్ 2025కు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలోనే జట్లు ఆటగాళ్ల కోసం మెగా వేలం నిర్వహించనున్నాయి.
ఐపీఎల్ 2025 వేలం దుబాయ్లో జరగనుంది. దేశం వెలుపల ఐపీఎల్ వేలం (IPL Auction Venue) నిర్వహించడం ఇదే తొలిసారి. ఈసారి మెగా వేలం దుబాయ్లో కాకుండా వేరే నగరంలో నిర్వహించవచ్చు. ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ చివరి వారంలో జరగనుంది. అయితే దీనికి సంబంధించిన వేదికను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇంకా ఖరారు చేయలేదు. చివరి వేలం దుబాయ్లో జరిగింది. దేశం వెలుపల ఐపీఎల్ వేలం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈసారి మెగా వేలం విదేశాల్లో జరగనుంది. అయితే దీనిని దుబాయ్లో కాకుండా వేరే నగరంలో నిర్వహించాలని బీసీసీఐ పరిశీలిస్తోంది.
Also Read: Droupadi Murmu : ఆఫ్రికన్ దేశాల పర్యటనకు బయలుదేరిన రాష్ట్రపతి
ఈ నగరం IPL 2025 మెగా వేలానికి వేదిక కానుంది
నవంబర్ చివరిలో జరగనున్న IPL 2025 మెగా వేలానికి సింగపూర్ను వేదికగా BCCI పరిశీలిస్తోంది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియాలోని ఒక నగరాన్ని కూడా పరిశీలిస్తున్నారు. బీసీసీఐ- ఐపీఎల్ అధికారులు కూడా అనేక ఎంపికలను ఆలోచిస్తున్నారు. అయితే సౌదీ అరేబియాలోని హోటళ్లు చాలా ఖరీదైనవి కాబట్టి సింగపూర్ మాత్రమే ఖరారు కానుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే మెగా వేలం ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై ఇప్పటి వరకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కూడా సమాచారం వస్తోంది. వేలానికి వెళ్లే తమ ప్రతినిధుల కోసం వీసా, ప్రయాణ ఏర్పాట్ల పనిని ప్రారంభించేందుకు వీలుగా త్వరలో తమకు తెలియజేస్తారని జట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మెగా వేలానికి ముందు అన్ని జట్లు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుందని మనకు తెలిసిందే. ఇందుకోసం అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చింది.