IPL 2021 : వేలం తర్వాతే ఐపీఎల్ వేదికపై తుది నిర్ణయం
అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి కూడా టోర్నీ ఇక్కడ జరుగుతుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. దీంతో ఈ సారి కూడా ఐపీఎల్ను బీసీసీఐ విదేశాల్లోనే నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
- By Hashtag U Published Date - 12:06 PM, Mon - 10 January 22
అయితే ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి కూడా టోర్నీ ఇక్కడ జరుగుతుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. దీంతో ఈ సారి కూడా ఐపీఎల్ను బీసీసీఐ విదేశాల్లోనే నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా ఐపీఎల్ నిర్వహణల్లో తమ తొలి ప్రాధాన్యం మాత్రం స్వదేశంలో నిర్వహించడమేనని బీసీసీఐ స్పష్టం చేసింది. అవసరమైతే ఒకే వేదికలో టోర్నీ నిర్వహించాలన్న ఆలోచనలో కూడా ఉందని సమాచారం. దీనితో పాటు ప్రేక్షకులు లేకుండా అయినా సరే భారత్ లోనే టోర్నీ జరిపేందుకు సిద్ధమవుతోంది. ఇవేవి కుదరకపోతేనే విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సారి కూడా విదేశాల్లోనే ఐపీఎల్ అన్న వార్తలను నమ్మొద్దని తాజాగా బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఐపీఎల్ 2022 సీజన్ కు సంబందించిన మెగా వేలం ముగిసిన తర్వాతే రాబోయే సీజన్ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు తమకు తెలుసని, ఐపీఎల్ వేదిక మార్పుపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదన్నారు.
ఇదిలాఉంటే.. దేశంలో ఇప్పటికే భారీగా కోవిడ్ కేసుల పెరుగుదలతో బీసీసీఐ లు దేశవాళీ టోర్నీలను ఇదిలా ఉంటే కరోనా ఆంక్షలు కఠినతరంగా మారిన నేపథ్యంలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగాల్సిన మెగా వేలాన్ని కూడా వారం పాటు ఆలస్యంగా నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అదే సమయంలో ముందుగానే నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు నుండి వేదికను తరలిస్తారా అనే దానిపై కూడా బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ వంటివి కొనసాగుతున్నాయి. ఒకవిధంగా ఇది ఇబ్బందికరమైన పరిణామంగానే చెప్పాలి. కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఇప్పటికే రంజీ సీజన్ తో పాటు దేశవాళీ టోర్నీలను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. ఐపీఎల్ ఆటగాళ్ళ మెగా వేలంపై మరో వారం పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
Tags
Related News
SRH Playoffs: టాస్ వేయకుండానే మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్కు చేరిన సన్రైజర్స్ హైదరాబాద్
సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నిరంతర వర్షం కారణంగా మైదానం మొత్తం కవర్లతో కప్పారు.