Ms Dhoni : చెన్నైలో అడుగుపెట్టిన ధోనీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం జరగనుంది.
- By Hashtag U Published Date - 12:02 PM, Fri - 28 January 22
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం జరగనుంది. దీంతో ఫ్రాంచైజీలన్నీ ఆటగాళ్ల కొనుగోలుపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రానున్న సీజన్ కోసం ప్రిపేరేషన్ ప్రారంభించడానికి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెన్నైకి చేరుకున్నాడు. అయితే మెగా వేలం జరగనున్న బెంగళూరుకు వెళ్లే ముందు ధోనీ చెన్నైలో ఆ ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కలవనున్నాడు. సీజన్ మెగా వేలంలో జట్టు అనుసరించాల్సిన వ్యూహాలపై ధోని..చెన్నై మేనేజ్ మెంట్ తో చర్చించనున్నాడు. ఈసారి బెంగళూరులో జరిగే వేలంలో కూడా ధోని పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. చెన్నై ఎప్పటిలానే పలువురు యువ ఆటగాళ్ళు, సీనియర్ ప్లేయర్స్ ను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్ళను చెన్నై వేలంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రానున్న 10 ఏళ్ళకు జట్టు కూర్పును సన్నద్ధం చేసుకుంటామని ఆ ఫ్రాంచైజీ ఓనర్ శ్రీనివాసన్ వెల్లడించారు.ఇదిలావుంటే.. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్కు పేరుంది. ధోని కెప్టెన్సీలో 2010, 2011, 2018, 2021 సీజన్లలో చాంపియన్గా నిలిచింది. ఇదంతా ఎంఎస్ ధోని సారథ్యం వల్లే సాధ్యమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు ఐపీఎల్-2022 సీజన్ రిటెన్షన్ ప్రక్రియ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్.. రవీంద్ర జడేజాను 16 కోట్లకు , ధోనిని 12 కోట్లకు , మొయిన్ అలీని 8 కోట్లకు , రుతురాజ్ గైక్వాడ్ను 6 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది.
Related News
Royal Challengers Bengaluru: ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే.. ఇలా జరగాల్సిందే..!
బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. RCB- CSK మధ్య జరిగే ఈ మ్యాచ్ ఫైనల్కు ఉండే క్రేజ్ను సాధించింది.