BCCI Ceremony: ఐఎపీల్ ముగింపు వేడుకలు అట్టహాసంగా!
ఐఎపీల్ అంటేనే క్రికెట్ అభిమానులకు పండుగ లాంటింది. హీరాహోరీగా జరిగే మ్యాచుల్లో ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేం.
- By Balu J Published Date - 03:58 PM, Sat - 16 April 22
ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు పండుగ లాంటింది. హీరాహోరీగా జరిగే మ్యాచుల్లో ఏ జట్టు గెలుస్తుందో చెప్పలేం. బాల్ బాల్ కు ఆట స్వరూపమే మారిపోతోంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు ఐపీఎల్ ను ఆస్వాదిస్తారు. అందుకే నిర్వాహకులు కూడా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లను ఎంతో ఎంతో అట్టహసంగా మొదలుపెడతారు. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. కానీ కొవిడ్ కారణం ఐపీఎల్ లో అలాంటివేమీ కనిపించడం లేదు. అందుకే ఈ సారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 కోసం ముగింపు వేడుకను ఘనంగా నిర్వహించాలని యోచిస్తోంది. 2019 సంవత్సరానికిగాను T20 లీగ్కు ఎలాంటి వేడుకలు జరపలేదు. దేశంలో కోవిడ్-19 పరిస్థితి అదుపులో ఉన్నట్లయితే, ఈ సీజన్ చివరిలో ఈవెంట్ ప్లాన్ చేయాలని ఆలోచిస్తోంది. ముగింపు వేడుకను నిర్వహించే ఆలోచన ప్రక్రియలో ఉందని, ఉన్నతాధికారులు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మీడియాకు తెలిపారు.
ఏప్రిల్ 16న BCCI ముగింపు వేడుకను నిర్వహించడానికి ప్రతిపాదనలను కోరింది. “ఐపిఎల్ 2022 ముగింపు వేడుకలను టెండర్ ప్రక్రియ ద్వారా నిర్వహించేందుకు బిసిసిఐ ప్రఖ్యాత సంస్థల నుండి బిడ్లను ఆహ్వానిస్తుంది” అని భారత క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని అనుకూలిస్తే త్వరలోనే ఈవెంట్ ప్లాన్ చేయాలని భావిస్తోంది. ఐపీఎల్ 2022 ఫైనల్ మే 29న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు కేటాయించిన నిధులను విరాళంగా ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజాలు, ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
Related News
Selection Committee: టీమిండియా సెలక్షన్ కమిటీపై మాజీ క్రికెటర్ ఫైర్..!
టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ భారత సెలక్షన్ కమిటీపై తీవ్ర ఆరోపణలు చేశారు.