IPL 2022 : ఐపీఎల్ మెగా వేలం బరిలో 1214 మంది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి రెండో వారంలో బెంగళూరు వేదికగా ఈ వేలం జరగబోతోంది. ప్రస్తుతానికి వేలం వేదికపై కాస్త సందిగ్ధత నెలకొన్నా.. ఈ వారంలో బీసీసీఐ తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది
- By Hashtag U Published Date - 10:54 AM, Sat - 22 January 22
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి రెండో వారంలో బెంగళూరు వేదికగా ఈ వేలం జరగబోతోంది. ప్రస్తుతానికి వేలం వేదికపై కాస్త సందిగ్ధత నెలకొన్నా.. ఈ వారంలో బీసీసీఐ తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. కర్ణాటకలో ఆంక్షలను పరిగణలోకి తీసుకున్న బోర్డు సెకండ్ ఛాయిస్ గా ముంబైని ఎంచుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే వేలం కోసం ఆటగాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ సారి మెగా వేలానికి ప్రపంచ వ్యాప్తంగా 1214 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 896 మంది స్వదేశీ ఆటగాళ్ళుండగా.. 318 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో 270 మంది క్యాప్డ్ ప్లేయర్స్ , 903 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్స్ , 41 మంది అసోసియేట్ దేశాలకు చెందిన ప్లేయర్స్ ఉన్నారు. ఇండియా క్యాప్డ్ ప్లేయర్స్ లో గత ఐపీఎల్ సీజన్లు ఆడిన వారు 143 మంది ఉండగా… అంతర్జాతీయ క్రికెట్ తో పాటు గత ఐపీఎల్ సీజన్లు ఆడిన వారు ఆరుగురు ఉన్నారు. ప్రస్తుత ఐపీఎల్ వేలం నిబంధనల ప్రకారం ప్రతీ ఫ్రాంచైజీ గరిష్టంగా 25 మంది ప్లేయర్స్ ను తీసుకుంటే ఆక్షన్ లో 217 మంది అమ్ముడవుతారు. వీరిలో ఖచ్ఛితంగా 70 మంది విదేశీ ఆటగాళ్ళు ఉండబోతున్నారు.
కాగా వేలంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విదేశీ ఆటగాళ్ళలో ఆస్ట్రేలియా నుండి అత్యధికంగా 59 మంది ఉండగా.. సౌతాఫ్రికా నుండి 48 మంది , వెస్టిండీస్ నుండి 41 మంది , శ్రీలంక నుండి 36 మంది, ఇంగ్లాండ్ నుండి 30 మంది, న్యూజిలాండ్ నుండి 29 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇక ఆఫ్ఘనిస్థాన్ నుండి 20 , బంగ్లాదేశ్ నుండి 9 , ఐర్లాండ్ నుండి ముగ్గురు, జింబాబ్వే నుండి ఇద్దరు, నమీబియా నుండి ఐదుగురు, నేపాల్ నుండి 15 మంది, నెదర్లాండ్స్ , స్కాట్లాండ్ , భూటాన్, యుఏఈ , ఒక్కొక్కరూ ఒమన్ నుండి ముగ్గురు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాగా ఇప్పటికే 8 పాత ఫ్రాంచైజీలు 27 మంది ఆటగాళ్ళను రిటైన్ చేసుకోగా… రెండు కొత్త ఫ్రాంచైజీలు ముగ్గురు చొప్పున ఆరుగురు క్రికెటర్లను వేలానికి ముందే ఎంపిక చేసుకున్నాయి. కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ హార్థిక్ పాండ్యా , రషీద్ ఖాన్, శుభమన్ గిల్ ను ఎంపిక చేసుకోగా…టీమ్ లక్నో కెఎల్ రాహుల్ , స్టోయినిస్ , రవి బిష్ణోయ్ లను దక్కించుకుంది.
Tags
Related News
IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలం పూర్తి.. అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్ళే..!
IPL 2024 వేలం (IPL Auction 2024) పూర్తయింది. తొలిసారిగా ఐపిఎల్ వేలం భారతదేశం వెలుపల దుబాయ్లో జరిగింది. ఇందులో ఆటగాళ్లపై కోట్ల రూపాయల వేలం జరిగింది.