Indonesia Open 2023: సంచలనం.. ఇండోనేషియా ఓపెన్లో ఫైనల్స్కు చేరిన సాత్విక్ జోడీ
ఇండోనేషియా ఓపెన్ (Indonesia Open 2023)లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి (Satwik-Chirag) ఫైనల్స్కు చేరుకున్నారు.
- By Gopichand Published Date - 06:48 AM, Sun - 18 June 23
ఇండోనేషియా ఓపెన్ (Indonesia Open 2023)లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి (Satwik-Chirag) ఫైనల్స్కు చేరుకున్నారు. సెమీ ఫైనల్ మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట దక్షిణ కొరియాకు చెందిన మిన్ హ్యూక్, సెయుంగ్ జే సియోపై విజయం సాధించింది. అయితే పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో భారత స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. డెన్మార్క్కు చెందిన విక్టర్ అక్సెల్సెన్ చేతిలో హెచ్ఎస్ ప్రణయ్ ఓడిపోయాడు. ఈ మ్యాచ్లో విక్టర్ అక్సెల్సెన్ 21-15, 21-15తో భారత ఆటగాడిపై విజయం సాధించాడు.
సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి విజయం
ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 పురుషుల డబుల్స్ ఈవెంట్లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి 18-21, 21-19, 21-18తో దక్షిణ కొరియాకు చెందిన మిన్ హ్యూక్- సెయుంగ్ జే సియోలను ఓడించారు. ఇప్పుడు ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్లో ఇండోనేషియా లేదా మలేషియా.. సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టితో తలపడతాయి. మరో సెమీఫైనల్ లో ఇండోనేషియా- మలేషియా మధ్య జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు భారత్తో ఫైనల్ లో తలపడుతుంది.
Also Read: World Cup 2023: ఇదేం తీరు… పాక్ క్రికెట్ బోర్డు తీరుపై విమర్శలు
తొలి సెట్ను కోల్పోయిన భారత జోడీ అద్భుతంగా పునరాగమనం
భారత జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, దక్షిణ కొరియాకు చెందిన మిన్ హ్యూక్, సీయుంగ్ జే సియోల మధ్య మ్యాచ్ 1 గంటా 7 నిమిషాల పాటు సాగింది. భారత జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తొలి సెట్లో ఓటమి చవిచూడాల్సి వచ్చినప్పటికీ, ఆ తర్వాత భారత జోడీ అద్భుతంగా పునరాగమనం చేసింది. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తర్వాతి రెండు సెట్లలో దక్షిణ కొరియా జోడీని ఓడించి మ్యాచ్ను గెలుచుకున్నారు. దింతో ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 పురుషుల డబుల్స్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి 18-21, 21-19, 21-18 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన మిన్ హ్యూక్, సెయుంగ్ జే సియోను ఓడించి ఫైనల్ చేరుకున్నారు.
Related News
Gold In Badminton : ‘ఏషియన్ గేమ్స్’లో కొత్త రికార్డు.. బ్యాడ్మింటన్ లో భారత్ కు తొలి గోల్డ్
Gold In Badminton : ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ నెగ్గిన మొట్టమొదటి తొలి గోల్డ్ మెడల్ (Gold Medal) ఇదే.