India Victorious: వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు!
ఇది మాత్రమే కాదు మహిళల వన్డే క్రికెట్లో అతిపెద్ద రన్ ఛేజ్ కూడా ఇదే. అలాగే ఇదే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుపై 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది.
- Author : Gopichand
Date : 31-10-2025 - 8:31 IST
Published By : Hashtagu Telugu Desk
India Victorious: భారత మహిళల క్రికెట్ జట్టు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వన్డే వరల్డ్ కప్ చరిత్రనే తిరగరాశారు. ఆస్ట్రేలియాపై జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ జట్టు ఏడుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. మహిళల క్రికెట్లో 50 ఓవర్ల ఫార్మాట్లో భారత జట్టు అతిపెద్ద రన్ ఛేజ్ను విజయవంతంగా (India Victorious) పూర్తి చేసింది. ఈ విజయంలో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ హీరోలుగా నిలిచారు.
జెమీమా 127 పరుగులతో నాటౌట్గా ఉండి జట్టును విజయతీరాలకు చేర్చింది. హర్మన్ 89 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. వన్డే ప్రపంచకప్లోని నాకౌట్ మ్యాచ్లలో భారత జట్టు పురుషుల క్రికెట్లో కూడా ఇప్పటివరకు జరగని ఘనతను సాధించింది.
Also Read: Jemimah Rodrigues: భారత్ను ఫైనల్స్కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్!
చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు
వన్డే ప్రపంచకప్లోని నాకౌట్ మ్యాచ్లలో 300 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఒక జట్టు విజయవంతంగా ఛేదించడం ఇది మొదటిసారి. దీనికి ముందు పురుషులు లేదా మహిళల వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలో ఏ జట్టు కూడా 300 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేదు. పురుషుల క్రికెట్లో 2015లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాపై 298 పరుగులను ఛేదించింది. ఇది ఈ మ్యాచ్కు ముందు అత్యధిక స్కోరు. అయితే భారతీయ అమ్మాయిలు ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్రను లిఖించారు.
మహిళల వన్డే క్రికెట్లో అతిపెద్ద రన్ ఛేజ్
ఇది మాత్రమే కాదు మహిళల వన్డే క్రికెట్లో అతిపెద్ద రన్ ఛేజ్ కూడా ఇదే. అలాగే ఇదే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుపై 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు హర్మన్ప్రీత్ సేన అదే కంగారూలపై 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల క్రికెట్లో 300 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇది మూడోసారి మాత్రమే. ఇది ఈ ఫార్మాట్లో టీమ్ ఇండియా రెండవ అతిపెద్ద స్కోరు కూడా. దీనికి ముందు వన్డే ప్రపంచకప్లో భారత జట్టు ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేదు. భారత జట్టు తరఫున జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ 127 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడింది.