Ind Vs Zim Preview:జింబాబ్వేతో జర జాగ్రత్త
టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 స్టేజ్ లో చివరి మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది.
- By Naresh Kumar Published Date - 10:18 AM, Sun - 6 November 22
టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 స్టేజ్ లో చివరి మ్యాచ్ కు టీమిండియా సిద్ధమైంది. దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న రోహిత్ సేన జింబాబ్వేపై గెలిచి టాప్ ప్లేస్ తో సూపర్ 12ను ముగించాలని భావిస్తోంది. అయితే ప్రత్యర్థి జింబాబ్వేను ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ టోర్నీ నుంచి సూపర్ 12 స్టేజ్ వరకూ జింబాబ్వే అద్భుతంగా ఆడుతుందన్న విషయం అంగీకరించాల్సిందే. క్వాలిఫైయింగ్ టోర్నీలో ఎలా ఉన్నా…పాక్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే స్వయంకృతాపరాధమే అవుతుంది. బ్యాటింగ్ పరంగా రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో ఉండగా.. రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ భారీ ఇన్నింగ్స్ లు బాకీ ఉన్నారు. జింబాబ్వేతో వీరిద్దరూ కూడా ఫామ్ అందుకుంటే భారీస్కోరు ఖాయం. అటు బౌలింగ్ లో సమిష్టిగా రాణిస్తున్న టీమిండియా బౌలర్లు సెమీస్ కు ముందు తమ లయ కొనసాగించడం కూడా ముఖ్యమే
మరోవైపు జింబాబ్వే కూడా కాన్ఫిడెంట్ గా ఉంది. పాక్ పై గెలిచిన తర్వాత వారిలో జోష్ మరింత పెరిగింది. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ చివరి వరకూ పోరాడడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. భారత్ తో మ్యాచ్ లో కూడా సంచలనం సృష్టించాలని ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు జింబాబ్వే గెలిస్తే సెమీస్ లో భారత్ ఇంగ్లాండ్ తో తలపడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా చిన్న జట్టు జింబాబ్వే జర జాగ్రత్త అంటూ మాజీలు, విశ్లేషకులు భారత్ ను అలెర్ట్ చేస్తున్నారు.
Related News
T20 World Cup: టీ20 ప్రపంచ కప్లో ఈ ముగ్గురు ఆటగాళ్లకు చోటు కష్టమే.. ఐపీఎల్లో బ్యాడ్ ఫెర్ఫార్మెన్స్..!
T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup).. ఐపీఎల్ తర్వాత వెంటనే ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 17వ సీజన్ చివరి మ్యాచ్ మే 26న జరగనుండగా, టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది.