India Loses Toss: టీమిండియా ఖాతాలో మరో చెత్త రికార్డు!
రాయ్పూర్లో టాస్ గెలవాలనే ఒత్తిడిలో తాను ఉన్నానని టీమ్ ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా కనిపించారు.
- By Gopichand Published Date - 03:10 PM, Wed - 3 December 25
India Loses Toss: భారత్- దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే మ్యాచ్ రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్ ఇండియా మరోసారి టాస్ (India Loses Toss) కోల్పోయింది. రోహిత్ శర్మ తర్వాత శుభ్మన్ గిల్కు వన్డే జట్టు కెప్టెన్సీ అప్పగించారు. అయితే గిల్ గాయం కారణంగా కేఎల్ రాహుల్కు జట్టు కెప్టెన్సీని అప్పగించారు.
కెప్టెన్లు మారుతున్నారు.. కానీ జట్టు అదృష్టం మాత్రం మారడం లేదు. భారత జట్టు వన్డే అంతర్జాతీయ మ్యాచ్లలో వరుసగా 20వ సారి టాస్ ఓడిపోయింది. ఇది ఒక ప్రపంచ రికార్డ్. గతంలో వన్డే చరిత్రలో ఏ జట్టు కూడా వరుసగా ఇన్ని టాస్లు ఓడిపోలేదు.
Also Read: PM Modi AI Video: ప్రధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయటం కరెక్టేనా?!
🚨 20 CONSECUTIVE TOSS LOST FOR INDIA IN ODIs 🚨 pic.twitter.com/ZdPr0vdmXa
— Johns. (@CricCrazyJohns) December 3, 2025
టీమ్ ఇండియాను వదలని ‘దురదృష్టం’
భారత జట్టు టాస్ ఓడిపోయే పరంపర 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ నుండే మొదలైంది. ఇది రెండు సంవత్సరాలకు పైగా గడిచినా ముగియడం లేదు. అప్పుడు జట్టు పగ్గాలు రోహిత్ శర్మ చేతిలో ఉన్నాయి. అతని కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక్క టాస్ కూడా గెలవలేదు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ అదృష్టం కూడా అతనికి తోడ్పడలేదు. అతను కూడా ఒక్క టాస్ కూడా గెలవలేకపోయాడు.
ఇప్పుడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో కూడా టీమ్ ఇండియా వరుసగా రెండు టాస్లు ఓడిపోయింది. వన్డే అంతర్జాతీయ క్రికెట్లో భారత్కు ఇది వరుసగా 20వ టాస్ ఓటమి. ఇది ఒక ప్రపంచ రికార్డ్. గూగుల్ జెమిని గణాంకాల ప్రకారం.. ఇది 10 లక్షల 48 వేలలో ఒక్కసారి మాత్రమే జరిగే దుర్ఘటన. ఇప్పటివరకు ఏ జట్టుకు ఇలా జరగలేదు.
టాస్ ఓడిన తర్వాత కేఎల్ రాహుల్ ఏమన్నాడు?
రాయ్పూర్లో టాస్ గెలవాలనే ఒత్తిడిలో తాను ఉన్నానని టీమ్ ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా కనిపించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరిస్తూ.. “నిజం చెప్పాలంటే టాస్ గెలవాలనే ఒత్తిడి నాపై చాలా ఉంది. ఎందుకంటే మేము చాలా కాలంగా వన్డేలో ఒక్క టాస్ కూడా గెలవలేదు. నేను దీని కోసం ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. కానీ దాని ప్రభావం కనిపించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. గత మ్యాచ్లో మా ప్రదర్శన అద్భుతంగా ఉందని నేను అనుకుంటున్నాను. అక్కడ మాకు చాలా సానుకూల అంశాలు లభించాయి. వాటిని మేము ముందుకు కూడా కొనసాగించాలనుకుంటున్నాము” అని అన్నారు.
రెండు జట్ల ప్లేయింగ్ XI
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
సౌత్ ఆఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్, టెంబా బావుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎన్గిడి.