India Beat Pakistan: పాకిస్థాన్పై టీమిండియా ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
- Author : Gopichand
Date : 06-10-2024 - 7:01 IST
Published By : Hashtagu Telugu Desk
India Beat Pakistan: మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ (India Beat Pakistan) ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు సాధించింది. దీంతో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. హర్మన్ప్రీత్ కౌర్ టీమ్ ఇండియాకు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. షఫాలీ వర్మ కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. బౌలింగ్లో శ్రేయాంక పాటిల్, అరుంధతీరెడ్డి తమ సత్తా చాటారు. ఈ మ్యాచ్లో పాకిస్థాన్కు శుభారంభం లభించలేదు.
Also Read: CM Revanth Reddy : గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది : సీఎం రేవంత్ రెడ్డి
106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు షఫాలీ వర్మ, స్మృతి మంధాన భారత్కు ఓపెనర్లుగా వచ్చారు. స్మృతి ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. 16 బంతుల్లో 7 పరుగులు చేసి ఔట్ అయింది. మంధానను సాదియా ఇక్బాల్ అవుట్ చేసింది. షఫాలీ 35 బంతులు ఎదుర్కొని 32 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ 23 పరుగులు చేసింది. రిచా ఘోష్ ఖాతా కూడా తెరవలేకపోయింది.
హర్మన్ప్రీత్ 24 బంతులు ఎదుర్కొని 29 పరుగులు చేసింది. అయితే మ్యాచ్కు ముందు ఆమె గాయం కారణంగా మైదానానికి దూరంగా ఉంది. హర్మన్ప్రీత్కు మెడ సమస్య వచ్చింది. దీప్తి శర్మ 7 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. చివర్లో సజ్నా సజీవన్ ఫోర్ కొట్టి మ్యాచ్ గెలిపించింది. ఆమె అజేయంగా 4 పరుగులు చేసింది. దీంతో భారత్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. సాదియా ఇక్బాల్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 1 వికెట్ తీసింది. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈనెల 9న శ్రీలంకతో తలపడనుంది.