IND vs SA 2nd Test: కేప్ టౌన్ వేదికగా నేటి నుంచి రెండో టెస్ట్.. టీమిండియాలో మార్పులు..?
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ (IND vs SA 2nd Test) మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా నేటి నుంచి బుధవారం జరగనుంది.
- By Gopichand Published Date - 07:11 AM, Wed - 3 January 24
IND vs SA 2nd Test: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ (IND vs SA 2nd Test) మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా నేటి నుంచి బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా మ్యాచ్లో టాస్ మధ్యాహ్నం 1.30 గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఏ ప్లేయింగ్ 11తో గ్రౌండ్ లోకి ప్రవేశిస్తాడు? అనేది సందేహంగా మారింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇద్దరు స్పిన్నర్లతో వెళ్లాలని నిర్ణయించుకుంటే శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంటే న్యూలాండ్స్లో అశ్విన్, జడేజా జోడీని చూడొచ్చు. అయితే రోహిత్ నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్తో వెళ్లాలని నిర్ణయించుకుంటే.. అశ్విన్కి కూడా ఇబ్బంది కలగవచ్చు. అయితే స్పిన్నర్గా జడేజా ఒక్కడినే ఆడిస్తారు లేదా అన్నదే సందేహం.
యువ ఆటగాళ్లకు అండగా ఉంటానని రోహిత్ శర్మ మంగళవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణకు బహిరంగంగా మద్దతు తెలిపిన రోహిత్ ఈ ఫార్మాట్లో తప్పకుండా విజయం సాధిస్తాడని, అతనికి సత్తా ఉందని చెప్పాడు. యశస్వి, అయ్యర్, గిల్ పేర్లను తీసుకుంటే.. దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో పెద్దగా ఆడని యువ ఆటగాళ్లు వీరేనని చెప్పాడు. ఈ పరిస్థితిలో ఈ ముగ్గురు ఆటగాళ్లు కెప్టెన్పై నమ్మకాన్ని ఇంకా కోల్పోలేదని స్పష్టమవుతుంది. ఈ ముగ్గురిలో ఒకర్ని కేప్ టౌన్ టెస్ట్ లో చూసే ఛాన్స్ ఉంది.
Also Read: Redmi Note 13: మార్కెట్ లోకి సరికొత్త రెడ్ మీ స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ మామూలుగా లేవుగా?
కేప్టౌన్లోని న్యూలాండ్స్లో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక్కడ టీమిండియా రికార్డు చాలా దారుణంగా ఉంది. ఇక్కడ భారత జట్టు ఇప్పటివరకు 6 టెస్టు మ్యాచ్లు ఆడగా, అందులో 4 ఓడిపోయి 2 మ్యాచ్లు డ్రా చేసుకుంది. అంటే ఇప్పటి వరకు కేప్టౌన్లో టెస్టు మ్యాచ్లో విజయం సాధించలేకపోయింది. కేప్టౌన్లో తన పేలవమైన రికార్డును సరిదిద్దుకోవడానికి భారత జట్టు కూడా ప్రయత్నిస్తుంది.
టీమిండియా జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
We’re now on WhatsApp. Click to Join.
Related News
T20 World Cup: టీ20 ప్రపంచకప్ జట్టులో విరాట్ ఉండాల్సిందేనని పట్టుబట్టిన రోహిత్.. మాజీ క్రికెటర్ పోస్ట్ వైరల్..!
టీ20 ప్రపంచకప్ (T20 World Cup) నుంచి భారత దిగ్గజ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీని తప్పించే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోహ్లికి ప్రపంచకప్ జట్టులో ప్లేస్ ఇవ్వడానికి టీమ్ సెలక్టర్లు సానుకూలంగా లేరు.