IPL 2025 : RCBకి దక్కిన ప్రైజ్ మనీ ఎంత..? పంజాబ్ ఓటమికి కారణాలు ఏంటి..?
IPL 2025 : ఫైనల్లో పంజాబ్ కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టు అభిమానులకు నిరాశను మిగిల్చింది. అయితే ఓటమికి కారణాలపై విశ్లేషణ చేస్తే
- Author : Sudheer
Date : 04-06-2025 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
బెంగళూరు జట్టు (RCB) చివరికి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ ఐపీఎల్ 2025 ట్రోఫీ(IPL 2025 Cup )ని సొంతం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్పై 6 పరుగుల తేడాతో గెలుపొందిన ఆర్సీబీకి బీసీసీఐ (BCCI) నుంచి రూ.20 కోట్లు ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్గా నిలిచిన పంజాబ్ జట్టుకు రూ.12.5 కోట్లు అందజేశారు. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనలకుగాను ఇతర ఆటగాళ్లను కూడా పురస్కారాలతో గౌరవించారు. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సాయి సుదర్శన్కు (759 పరుగులు) రూ.10 లక్షలు, పర్పుల్ క్యాప్ అందుకున్న ప్రసిద్ధ కృష్ణ (25 వికెట్లు)కు కూడా రూ.10 లక్షలు లభించాయి. అదేవిధంగా టోర్నీ ‘సూపర్ స్ట్రైకర్’గా ఎంపికైన సూర్య వంశీకి ప్రత్యేకంగా టాటా కర్వ్ కార్ బహుమతిగా లభించింది.
ఇక పంజాబ్ ఓటమికి కారణాలు (Reasons for Punjab’s Defeat) చూస్తే..
అంతకంతకూ ఉత్కంఠగా సాగిన ఈ ఫైనల్లో పంజాబ్ కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టు అభిమానులకు నిరాశను మిగిల్చింది. అయితే ఓటమికి కారణాలపై విశ్లేషణ చేస్తే ..ఆరంభంలోనే ఓపెనర్లు రన్రేట్ను పెంచలేకపోవడం ప్రధానంగా చూపవచ్చు. ముఖ్యంగా వధేరా నెమ్మదిగా ఆడటం, మధ్యలో శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగు కూ ఔటవ్వడం పంజాబ్ జట్టుపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఇక ఒక్క ఓవర్లో వధేరా, స్టోయినిస్ ఇద్దరూ వెనుదిరగడం మిగిలిన బ్యాటర్లపై మరింత భారాన్ని మోపింది.
పంజాబ్ బ్యాటర్లకు తడబాటుగా మిగిలింది గానీ, ఆర్సీబీ బౌలర్లు మాత్రం అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా కృనాల్ పాండ్య ఆఖరి ఓవర్లలో చూపిన కట్టుదిట్టమైన బౌలింగ్ మ్యాచ్పై ప్రభావం చూపింది. ఫీల్డింగ్లోనూ బెంగళూరు జట్టు పూర్తి స్థాయిలో ఏకాగ్రత కనబరిచింది. టోర్నీ మొత్తం లోపలిన డౌట్స్కు సమాధానంగా నిలిచిన ఆర్సీబీ ఈసారి చెరో మ్యాచ్లో విజయం సాధించి ట్రోఫీపై గెలిచినట్లు నిరూపించింది. ఇక ఈ విజయంతో అభిమానుల మనసుల్లో నిలిచిపోయారు విరాట్ సేన.
Virat Kohli Cry: 18 ఏళ్లుగా కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు ఇవీ.. వీడియో వైరల్!