Team India: టీమిండియా జట్టులో మార్పులు.. వీరికి అవకాశం..?
2023 ఆసియా కప్లో భారత జట్టు (Team India) ఫైనల్కు చేరుకుంది. టోర్నీలో ఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా టీం ఇండియా నిలిచింది.
- By Gopichand Published Date - 01:51 PM, Thu - 14 September 23
Team India: 2023 ఆసియా కప్లో భారత జట్టు (Team India) ఫైనల్కు చేరుకుంది. టోర్నీలో ఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా టీం ఇండియా నిలిచింది. గత మంగళవారం (సెప్టెంబర్ 12) శ్రీలంకను ఓడించి భారత్ తన ఫైనల్కు టిక్కెట్ను దక్కించుకుంది. అయితే ఫైనల్కు ముందు సెప్టెంబర్ 15వ తేదీ శుక్రవారం బంగ్లాదేశ్తో జట్టు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో గెలుపు ఓటము పెద్దగా పట్టించుకోదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్లో మార్పు రావచ్చు.
బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్లో మార్పు ఉంటుందని భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్వయంగా చెప్పారు. దీనిపై బౌలింగ్ కోచ్ మీడియా సమావేశం ద్వారా మాట్లాడారు. ఇప్పటికే జట్టు ఫైనల్స్కు చేరుకుందని, కాబట్టి రేపటి మ్యాచ్లో (బంగ్లాదేశ్తో) జట్టులోని ప్లేయింగ్ ఎలెవన్లో మార్పు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్తో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పాడు.
Also Read: C295 Aircraft: భారత వాయుసేనలోకి సీ-295 విమానం.. ప్రత్యేకతలు ఇవే..!
ఇవి సాధ్యమయ్యే మార్పులు
అన్నింటిలో మొదటిది జట్టులోని బౌలింగ్ యూనిట్లో మార్పులు చూడవచ్చు. ఫైనల్కు జస్ప్రీత్ బుమ్రా లేదా మహ్మద్ సిరాజ్కు విశ్రాంతి ఇచ్చి వారి స్థానంలో షమీని జట్టులోకి తీసుకోవచ్చు. ఇది కాకుండా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్కు కూడా ఫైనల్కు ముందు విశ్రాంతి ఇవ్వవచ్చు. రాహుల్ ఆసియా కప్లో గాయం తర్వాత తిరిగి వచ్చాడు. వరుసగా రెండు మ్యాచ్లు ఆడాడు. రెండింటిలోనూ రాణించాడు. తొలి మ్యాచ్ లో రాహుల్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడి అజేయ సెంచరీ సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు రెస్ట్ ఇవ్వడం దాదాపు ఖాయం. రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించగలడు. సూర్యకుమార్ యాదవ్కు బ్యాట్స్మెన్గా అవకాశం దక్కవచ్చు.
బంగ్లాదేశ్తో భారత్ ఆడే జట్టు..?
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్/మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా/మహమ్మద్ షమీ.
Related News
Virat Kohli Record: T20 ప్రపంచ కప్ గేమ్ల్లో కోహ్లీ రికార్డులు ఇవే.. లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
కొద్ది రోజుల క్రితం విరాట్ కోహ్లీ స్లో స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడని ట్రోల్ చేశారు. ఇటీవల 67 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత స్లో సెంచరీ సాధించిన ఘనత కోహ్లిదే.