Virat Fan: కోహ్లీతో సెల్ఫీ…23 వేలు ఖర్చు
వరల్డ్ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ వెంటపడుతూనే ఉంటారు.
- By Naresh Kumar Published Date - 09:12 PM, Sun - 2 October 22
వరల్డ్ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ వెంటపడుతూనే ఉంటారు. అందుకే కోహ్లీ తన బ్రేక్ టైం లో విదేశాల్లో ఫ్యామిలీతో గడుపుతుంటాడు. అయితే స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రం ఫాన్స్ ఫోటోలు , ఆటోగ్రాఫ్ ల కోసం విరాట్ వెంట పడుతుంటారు. దీని కోసం వాళ్ళు చాలా రిస్క్ తీసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా ఓ అభిమాని కోహ్లీ తో
సెల్ఫీ కోసం చాలా తెలివిగా వ్యవహరించాడు.
అయితే దీని కోసం అతను 23 వేలు ఖర్చు చేశాడు. అసలు విషయం ఏమిటంటే… గౌహతిలోని శాంతిపూర్కు చెందిన రాహుల్ రాయ్.. విరాట్తో సెల్ఫీ దిగాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ గౌహతీ వేదికగా జరుగుతుందని తెలిసినప్పటి నుంచే సెల్ఫీ దిగడానికి ప్రణాళికలు రచించాడు.
సెప్టెంబర్ 29న టీమిండియా గౌహతి చేరుకోగా.. ఎయిర్పోర్ట్లోనే సెల్ఫీ కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. సెక్యూరిటీ ధాటు కొని కోహ్లీ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించినా కుదురలేదు. టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న అస్సాం క్రికెట్ అసోసియేషన్ బర్సపర స్టేడియంకు వెళ్లినా సెక్యూరిటీ అనుమతించలేదు.దాంతో స్మార్ట్గా ఆలోచించిన రాహుల్.. టీమిండియా బస చేస్తున్న హోటల్లో ఓ రాత్రికి 23 వేలు చెల్లించి రూమ్ బుక్ చేసుకున్నాడు. హోటల్లో బ్రేక్ ఫాస్ట్ సమయంలో కోహ్లీ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించి సెక్యూరిటీ అతన్ని అడ్డుకుంది. వారిని ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. అతని ప్రయత్నాలను చూసిన విరాట్.. సెక్యూరిటీని వారించాడు. దాంతో రాహుల్ రాయ్ తన అభిమాన క్రికెటర్ను కలిసి సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియా అతను షేర్ చేయగా.. వైరల్ అయ్యాయి. తన కల నేరవేరిందని రాహుల్ రాయ్ సంతోషం వ్యక్తం చేశాడు.
Related News
RCB vs GT: ఐపీఎల్లో నేడు మరో ఉత్కంఠ పోరు.. గుజరాత్ వర్సెస్ బెంగళూరు..!
ఐపీఎల్లో శనివారం (మే 4) ఒక్క మ్యాచ్ మాత్రమే జరగనుంది. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో వారి స్వదేశంలో తలపడుతుంది.