HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Dhoni Painted The Seats In Chepauk Stadium Yellow Video Viral

Chepauk Stadium: చెపాక్ స్టేడియంలో సీట్లకు ఎల్లో పెయింట్ వేసిన ధోనీ.. వీడియో వైరల్..

స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సీట్లకు ఎల్లో పెయింట్ వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇప్పుడు కచ్చితంగా ఎల్లోలవ్‌లా..

  • Author : Naresh Kumar Date : 27-03-2023 - 4:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dhoni Painted The Seats In Chepak Stadium Yellow.. Video Viral
Dhoni Painted The Seats In Chepak Stadium Yellow.. Video Viral

Yellow Paint to Chepauk Stadium Seats : స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సీట్లకు ఎల్లో పెయింట్ వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇప్పుడు కచ్చితంగా ఎల్లోలవ్‌లా కనిపిస్తోంది..’ అంటూ ఆ వీడియో తో పాటు ధోనీ కామెంట్ చేశాడు.. ఇందుకు సంబంధించిన వీడియోను ధోనీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) టీమ్ షేర్ చేశాయి. ఇంతకీ ధోనీ ఎందుకు పెయింటింగ్ వేశాడు? ఎక్కడ పెయింటింగ్ చేశాడు ? ఇప్పుడు తెలుసుకుందాం..

స్టేడియంలోని కొత్త స్టాండ్స్‌ లో..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 సందడి మొదలైపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆడబోయే మొదటి నాలుగు మ్యాచులకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. మిగిలిన మ్యాచుల టికెట్లకు కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో చెపాక్ (ఎంఏ చిదంబరం) స్టేడియంలో కొన్ని కొత్త స్టాండ్స్‌ని పునర్మించారు. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, గ్రౌండ్ సిబ్బందితో కలిసి సోమవారం ఉదయం సీట్లకు ఎల్లో పెయింట్ వేశాడు.ఈ సీజన్ తో తన ఐపీఎల్ కెరీర్ కు ముగింపు ఇవ్వాలని అను కుంటున్న ధోనీ.. తన సహచరులతో సరదాగా గడుపుతున్నాడు. చెపాక్ స్టేడియాన్ని (Chepauk Stadium) ఈ మధ్యే పునరుద్ధరించారు.

చాలా ఏళ్ల తర్వాత ఐ,జే,కే స్టాండ్లను ఉపయోగంలోకి తెచ్చారు. ఈ సీజన్ ఐపీఎల్ లో అభిమానులను ఈ స్టాండ్లలోకి అనుమతించ నున్నారు. ఈ క్రమంలో స్టాండ్స్ లోని కుర్చీలకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ధోనీ కూడా పసుపు, నీలం రంగు స్ప్రే పెయింట్ క్యాన్‌లతో బయటికి వచ్చి చెపాక్‌లో రెండు కుర్చీలకు పెయింట్ చేశాడు. ఈ వీడియోను సీఎస్కే తమ ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ బస్సు ప్రయాణం వీడియోను కూడా ఆ టీమ్ షేర్ చేసింది. అందులో ధోని, డ్వేన్ బ్రావోకు విజిల్ వేయడం నేర్పించాడు.

“𝑫𝒆𝒇𝒊𝒏𝒊𝒕𝒆𝒍𝒚 𝒍𝒐𝒐𝒌𝒊𝒏𝒈 𝒀𝒆𝒍𝒍𝒐𝒗𝒆”
Anbuden Awaiting for April 3🦁💛 pic.twitter.com/eKp2IzGHfm

— Chennai Super Kings (@ChennaiIPL) March 27, 2023

ధోనీ ఫేర్‌వెల్ సీజన్‌..

స్టార్ స్పోర్ట్స్ తమిళ్ ఛానెల్, ధోనీ ఫేర్‌వెల్ సీజన్‌గా ఐపీఎల్ 2023 సీజన్‌ని ప్రమోట్ చేస్తోంది. అయితే సీఎస్‌కే ప్లేయర్లు దీపక్ చాహార్, రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ధోనీకి ఇది ఆఖరి సీజన్ కాదని, కాబోదని.. అతను ఇంకా రెండు మూడు సీజన్లు ఆడతాడని కామెంట్లు చేశారు.

మార్చి 31న, ఏప్రిల్ 3న..

ఐపీఎల్ ఈనెల 31న మొదల వనుంది. సీఎస్కే జట్టు ఈ సీజన్ లో తమ సొంతనగరంలో తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 3న లక్నోతో ఆడనుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై తొలి మ్యాచ్ ఆడనుంది. మూడు సీజన్‌ల తర్వాత సొంత మైదానం చెపాక్ లో మ్యాచ్‌లు ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2020 సీజన్ కరోనా లాక్‌డౌన్ కారణంగా పూర్తిగా యూఏఈలో జరిగింది.. 2021 సీజన్‌ ఫస్ట్ ఫేజ్‌లో చెన్నైలో మ్యాచులు జరిగినా సొంత మైదానం అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో సీఎస్‌కే మ్యాచులు జరగలేదు. 2022 సీజన్‌లోనూ చెన్నైలో మ్యాచులు నిర్వహించలేదు.

Also Read:  Liver Health Tips: మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాలి..!!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chepauk
  • Chepauk Stadium
  • dhoni
  • Painted
  • seats
  • Stadium
  • video
  • viral
  • Yellow

Related News

Gautam Gambhir replied to MS Dhoni's

MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

MS Dhoni అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయం తర్వాత, భారత క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజాలైన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌ల మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య ఉన్న పాత విభేదాల ఊహాగానాలకు ఈ సంఘటన

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd