Dhoni Autograph: ధోని ఆటోగ్రాఫ్ కోసం చాహర్ చిన్నపిల్లాడి చేష్టలు
ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
- By Praveen Aluthuru Published Date - 08:51 PM, Tue - 30 May 23
Dhoni Autograph: ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్లో సాయి సుదర్శన్ 96 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో వృద్ధిమాన్ సాహా 54 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సీఎస్కే బౌలర్ దీపక్ చాహర్ ఘోర తప్పిదం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ బాదిన ఒక బంతిని చాహర్ వదిలిపెట్టాడు. తుషార్ దేశ్పాండే బౌలింగ్ లో గిల్ ఆడిన బంతి నేరుగా దీపక్ చాహర్కి వెళ్ళింది. సులువైన ఆ క్యాచ్ని దీపక్ వదిలేశాడు. కాగా రవీంద్ర జడేజా బౌలింగ్లో శుభ్మన్ గిల్ను ఎంఎస్ ధోని స్టంపౌట్ చేశాడు.
#MSDhoni funny banter with #DeepakChahar #GTvCSK #MSDhoni𓃵 #CSK pic.twitter.com/RchHBq3HZe
— Jeevan Santhosh (@ijeevan) May 29, 2023
మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వాస్తవానికి మ్యాచ్ ముగిసిన తర్వాత దీపక్ చాహర్ తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలని మహీని పదేపదే కోరాడు. అయితే అతనికి ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి మహీ నిరాకరించాడు. కానీ చాహర్ పదేపదే పట్టుబట్టడంతో ధోని చాహర్ కి ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా మ్యాచ్ అనంతరం దీపక్ చాహర్ హోటల్లో డ్యాన్స్ చేస్తూ గోలగోల చేశాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Celebration by Deepak Chahar at the hotel. pic.twitter.com/DMtdZvEcJI
— Johns. (@CricCrazyJohns) May 30, 2023
చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన పోరులో చెన్నై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి జట్టుని గెలిపించాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో 2 బంతులకు 10 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో రవీంద్ర జడేజా రెండు అద్భుత షాట్లు కొట్టాడు. ఒక సిక్స్, ఒక ఫోర్ బాది జట్టుని గెలిపించాడు.
Read More: WTC 2023 Final: ఇంగ్లిష్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా
Tags
Related News
MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ కు తీపి కబురు.. 2025 ఐపీఎల్ లో ధోనీ కన్ఫర్మ్
ఈ సీజన్ ఐపీఎల్ అందరి చూపు మహేంద్ర సింగ్ ధోనీ పైనే ఉంది. ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాహీ చివరి మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చెన్నై ఆడే మైదానాల్లో ఫ్యాన్స్ తో ఎల్లోమయం అయిపోతుంది.