CSK vs RCB Ticket Sale: నేటి నుంచి ఐపీఎల్ టికెట్ల విక్రయాలు.. ధరలు ఎంతంటే..?
మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB Ticket Sale) మధ్య జరగనున్న మ్యాచ్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఇది IPL 2024 ప్రారంభ మ్యాచ్.
- By Gopichand Published Date - 03:05 PM, Mon - 18 March 24
CSK vs RCB Ticket Sale: మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB Ticket Sale) మధ్య జరగనున్న మ్యాచ్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఇది IPL 2024 ప్రారంభ మ్యాచ్. సోమవారం ఉదయం నుంచి ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం ప్రారంభం కాగా, విండో తెరుచుకోగానే వేలాది మంది క్యూ కట్టారు. ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో టిక్కెట్లు కొనేందుకు అభిమానులు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే వేలాది మంది అభిమానులు నిరాశ చెందారు.
టికెట్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే, వేలాది మంది అభిమానులు ఆన్లైన్లో క్యూ కట్టారు. చెన్నై- బెంగుళూరుకు టిక్కెట్ ధరలు రూ. 1700 నుండి ప్రారంభమవుతాయి. బుకింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వెబ్సైట్ కూడా క్రాష్ అయింది. వాస్తవానికి పేటీఎం ఇన్సైడర్లో మ్యాచ్ టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. ఇక్కడ వేలాది క్యూల కారణంగా వెబ్సైట్ పనిచేయడం ఆగిపోయింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని Paytm సోషల్ మీడియాలో కూడా ఇచ్చింది. వెబ్సైట్లో సాంకేతిక సమస్య ఉందని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.
Also Read: Election Commission: 6 రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులను తొలగించిన ఈసీ
RCB, CSK మ్యాచ్ టిక్కెట్లు అనేక శ్రేణులలో ఉన్నాయి. రూ.1700 నుంచి రూ.7500 వరకు టిక్కెట్లు ఉన్నాయి. అయితే వేలాది మంది అభిమానులు టిక్కెట్లు పొందలేకపోతున్నారు. టికెట్ రాలేదంటూ అభిమానులు సోషల్ మీడియాలో పలు పోస్టులను షేర్ చేస్తున్నారు. టిక్కెట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. మార్చి 22న చెన్నైలో సీఎస్కే, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగడం గమనార్హం. రికార్డులను పరిశీలిస్తే.. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 31 మ్యాచ్లు జరిగాయి. ఈ సమయంలో చెన్నై 20 మ్యాచ్లు గెలిచింది. బెంగళూరు 10 మ్యాచ్ల్లో విజయం సాధించింది.
We’re now on WhatsApp : Click to Join
Tags
Related News
IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్టీసీ బస్సులు
IPL 2024: ఉప్పల్ స్టేడియంగా పిలిచే హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ (ఆర్జీఐసీ) స్టేడియంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ కోసం 60 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఈ బస్సులు 24 రూట్లలో సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు నడుస్తాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ కోసం ఆర్ట�