Test 150th Anniversary: టెస్టు క్రికెట్కు 150 ఏళ్లు.. ఎప్పుడంటే?
రెండు జట్ల మధ్య ఈ ప్రత్యేక టెస్టు మార్చి 11 నుంచి మార్చి 15 మధ్య జరగనుంది. 1877లో మొదటి టెస్ట్ మ్యాచ్, 1977లో సెంటెనరీ టెస్ట్ జరిగిన MCGలో ఆస్ట్రేలియా జట్టు ఫ్లడ్లైట్ల వెలుగులో టెస్ట్ ఆడడం ఇదే మొదటిసారి.
- Author : Gopichand
Date : 11-03-2025 - 1:52 IST
Published By : Hashtagu Telugu Desk
Test 150th Anniversary: 2027 టెస్ట్ క్రికెట్కు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సంవత్సరం పురుషుల టెస్ట్ క్రికెట్ 150వ వార్షికోత్సవం (Test 150th Anniversary) జరుపుకోనుంది. దీన్ని ప్రత్యేకంగా చేయడానికి ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక పెద్ద ప్రకటన చేసింది. ఇక్కడ మార్చి 2027లో ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య పింక్ బాల్తో ఏకైక డే-నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నట్లు ప్రకటించింది.
మార్చి 11 నుంచి టెస్టు ప్రారంభమవుతుంది
రెండు జట్ల మధ్య ఈ ప్రత్యేక టెస్టు మార్చి 11 నుంచి మార్చి 15 మధ్య జరగనుంది. 1877లో మొదటి టెస్ట్ మ్యాచ్, 1977లో సెంటెనరీ టెస్ట్ జరిగిన MCGలో ఆస్ట్రేలియా జట్టు ఫ్లడ్లైట్ల వెలుగులో టెస్ట్ ఆడడం ఇదే మొదటిసారి. విశేషమేమిటంటే ఈ రెండు టెస్టుల్లోనూ కంగారూ జట్టు 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2027లో భారత్లో ఆస్ట్రేలియా ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత ఈ మ్యాచ్ జరగనుంది.
Also Read: X Cyber Attack: ‘ఎక్స్’పై సైబర్ ఎటాక్.. ‘డార్క్ స్టార్మ్’ పనా ? ‘ఉక్రెయిన్’ పనా ?
ఆస్ట్రేలియా- ఇంగ్లండ్లోని ఆటగాళ్లు 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆలస్యంగా చేరగలరు. IPL సీజన్ 2027 సంవత్సరంలో మార్చి 14 నుండి మే 30 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి CA CEO టాడ్ గ్రీన్బర్గ్ మాట్లాడుతూ.. MCGలో జరిగే 150వ వార్షికోత్సవ టెస్ట్ గొప్ప క్రికెట్ ఈవెంట్లలో ఒకటిగా ఉంటుంది. ఫ్లడ్లైట్ల కింద ఆడటం మా ఆట అద్భుతమైన వారసత్వాన్ని, టెస్ట్ క్రికెట్ ఆధునిక పరిణామాన్ని జరుపుకోవడానికి గొప్ప మార్గమని ఆయన పేర్కొన్నారు.
అతను ఇంకా మాట్లాడుతూ.. వీలైనన్ని ఎక్కువ మంది అభిమానులు టెస్టు మ్యాచ్లు చూసేలా చేయాలనుకుంటున్నాం. సెంటెనరీ టెస్ట్లో డేవిడ్ హుక్స్ టోనీ గ్రేగ్లో వరుసగా ఐదు ఫోర్లు, రిక్ మెక్కోస్కర్ బ్యాటింగ్, డెరెక్ రాండిల్ నుండి ఫైటింగ్ సెంచరీతో సహా అనేక అద్భుతమైన ప్రదర్శనలు జరిగాయి. 150వ టెస్టు జీవితకాల జ్ఞాపకాలను మిగుల్చుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.