India vs Pakistan: ఆసియా కప్లో పాక్తో భారత్ మ్యాచ్ ఆడతుందా? లేదా?
గత రెండు నెలలుగా రెండు దేశాల మధ్య జరిగిన పరిస్థితుల దృష్ట్యా, ఈ మ్యాచ్పై మీ వైఖరి ఏమిటి?" అని అడిగాడు. అయితే ఈ ప్రశ్న పూర్తి కాకముందే బీసీసీఐ మీడియా మేనేజర్ జోక్యం చేసుకొని "ఆగండి. జట్టు ఎంపికకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు" అని చెప్పడంతో రిపోర్టర్ మౌనంగా ఉండిపోయారు.
- By Gopichand Published Date - 03:07 PM, Wed - 20 August 25

India vs Pakistan: ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి పత్రికా సమావేశం నిర్వహించి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఈ పత్రికా సమావేశంలో ఒక రిపోర్టర్ భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్పై ప్రశ్న అడిగినప్పుడు, బీసీసీఐ ఆ విషయాన్ని పక్కన పెట్టేందుకు ప్రయత్నించింది. రిపోర్టర్.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అజిత్ అగార్కర్ను ఉద్దేశించి.. “సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య పెద్ద మ్యాచ్ జరగనుంది. గత రెండు నెలలుగా రెండు దేశాల మధ్య జరిగిన పరిస్థితుల దృష్ట్యా, ఈ మ్యాచ్పై మీ వైఖరి ఏమిటి?” అని అడిగాడు. అయితే ఈ ప్రశ్న పూర్తి కాకముందే బీసీసీఐ మీడియా మేనేజర్ జోక్యం చేసుకొని “ఆగండి. జట్టు ఎంపికకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు” అని చెప్పడంతో రిపోర్టర్ మౌనంగా ఉండిపోయారు.
సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్
ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా తమ మొదటి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ల మధ్య మహా పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో కొంతమంది భారతీయ అభిమానులలో ఈ మ్యాచ్ పట్ల ఆగ్రహం కనిపిస్తోంది.
Also Read: Cancellation of Student Visa : విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత అభిమానులు పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దీని ప్రభావం వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్పై కూడా పడింది. ఆ టోర్నమెంట్లో భారత జట్టు పాకిస్థాన్తో ఆడటానికి నిరాకరించిన విషయం తెలిసిందే.
ఆసియా కప్ కోసం భారత జట్టు
- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.