Rayudu Retirement : అంబటి రాయుడికి హ్యాకర్ల దెబ్బ
చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ అంబటి రాయుడు ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్కు గురైంది.
- By Naresh Kumar Published Date - 03:14 PM, Sat - 14 May 22
చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ అంబటి రాయుడు ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్కు గురైంది. తాను ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానంటూ రాయుడు ట్వీట్ చేయడం… కాసేపటికే దానిని తొలగించడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. అయితే తాజాగా రాయుడు దీనిపై వివరణ ఇచ్చాడు. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్కు గురైందని, తాను ఆ ట్వీట్ చేయలేదని తెలిపాడు. ఐపీఎల్కు గుడ్బై చెబుతున్నానంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని, వచ్చే సీజన్ కూడా ఆడతానంటూ రాయుడు స్పష్టం చేశాడు. ఈ రెండు ట్వీట్ల గంట వ్యవధిలో రావడంతో ఆ సమయంలో చాలా మంది ఫ్యాన్స్ రాయుడికి వీడ్కోలు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. అటు పలువురు మాజీలు కూడా ట్వీట్లు చేయడంతో గందరగోళం నెలకొంది.
తానూ ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంబటి రాయుడు పేరిట వచ్చిన మొదటి ట్వీట్లో ఉంది. ఐపీఎల్లో గత కొన్నాళ్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్న ఈ తెలుగు తేజం.. ఆ జట్టు అభిమానుల్లో ప్రత్యేకమైన స్ధానం సంపాందించుకున్నాడు.ఇది నా చివరి ఐపిఎల్ అని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. నేను 13 ఏళ్లుగా ఈ మెగా టోర్నీలో ఆడుతున్నాను. టోర్నీలో అత్యంత విజయవంతమైన 2 గొప్ప జట్లలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను. నా ఐపీఎల్ కెరీర్ లో నాకు వరుస అవకాశాలిచ్చిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాననంటూ ట్వీట్ చేశాడు. కాసేపటికే దీనిని తొలగించిన రాయుడు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ మరో ట్వీట్ చేశాడు. రిటైర్మెంట్ ట్వీట్ తాను చేయలేదని, తన అకౌంట్ హ్యాకింగ్కు గురైందని అసలు విషయం చెప్పాడు. వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతానంటూ క్లారిటీ ఇచ్చాడు. 36 ఏళ్ళ అంబటి రాయుడు ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 187 మ్యాచ్లు ఆడి 29. 08 సగటుతో 4187 పరుగులు చేశాడు. ఇందులో 22హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. అలాగే టీమిండియా తరఫున 55 వన్డేలు, 6 టీ20 మ్యాచ్లు అంబటి రాయుడు ఆడాడు. ఇదిలా ఉంటే, సీఎస్కే..ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ. 6.75 కోట్లు చెల్లించి అంబటి రాయుడును సొంతం చేసుకుంది.
Related News
Ambati Rayudu : వైసీపీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు
వైసీపీలో చేరినా ఆ పార్టీలోని ఆధిపత్య ధోరణి, రాచరికాన్ని చూసి అందులో ఉండలేకపోయానని తెలిపారు