3 Killed : హైదరాబాద్ గాంధీనగర్లో విషాదం.. ఇద్దరు చిన్నారుల సహా మహిళ ఆత్మహత్య
హైదరాబాద్ బన్సీలాల్పేట గాంధీనగర్లో విషాదం నెలకొంది. సోమవారం 26 ఏళ్ల యువతి తన ఇద్దరు పసిబిడ్డలతో కలిసి
- By Prasad Published Date - 07:41 AM, Tue - 20 June 23

హైదరాబాద్ బన్సీలాల్పేట గాంధీనగర్లో విషాదం నెలకొంది. సోమవారం 26 ఏళ్ల యువతి తన ఇద్దరు పసిబిడ్డలతో కలిసి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, మృతురాలు సౌందర్యగా పోలీసులు గుర్తించారు. సౌందర్యకు గణేష్ అనే వ్యక్తితో వివాహమై బన్సీలాల్పేటలోని ప్రభుత్వ భవనంలో ఉంటోంది. ఈ జంటకు కవల పిల్లలు ఉన్నారు. ఇద్దరికీ దాదాపు రెండు సంవత్సరాల వయస్సు ఉంటుంది. సోమవారం కుటుంబ సమస్యలపై దంపతులు గొడవపడి గణేష్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. సౌందర్య తన పసిపిల్లలతో కలిసి భవనం పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అదనపు కట్నం కోసం గణేష్ తన భార్యను తరచూ వేధించేవాడని బంధువులు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.