Telangana Elections : తెలంగాణలో ఆ రెండు రోజులు వైన్ షాపులు, బార్లు బంద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నవంబర్ 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు సహా మద్యం
- By Prasad Published Date - 05:56 PM, Fri - 3 November 23
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నవంబర్ 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు సహా మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 30 పోలింగ్ ముగిసే వరకు అవి మూసివేయబడతాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు రోజున కూడా వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయబడతాయి.పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల పాటు మద్యం, విక్రయాలపై పూర్తి నిషేధం అమలు చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. ఈ రోజు (నవంబర్ 3న) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Related News
Home Voting : తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్ ప్రక్రియ
Home Voting Process: తెలంగాణ(Telangana)లో ఈనెల 13న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ఓటింగ్ జరునున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఇటీవల ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ(Home Voting Process) తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్లు(Senior citizens), వికలాంగులు(handicaps) (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. బషీర్బాగ్లోని ఆల�