KTR IT Park: ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తా!
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం ఆదిలాబాద్ లో బీడీఎన్టీ ల్యాబ్స్ను సందర్శించి సాఫ్ట్వేర్ ఉద్యోగులతో ముచ్చటించారు.
- By Balu J Published Date - 04:27 PM, Mon - 26 September 22
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సోమవారం బీడీఎన్టీ ల్యాబ్స్ను సందర్శించి సాఫ్ట్వేర్ ఉద్యోగులతో ముచ్చటించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) అమలు చేసిన రూరల్ టెక్నాలజీ పాలసీ కారణంగానే రాష్ట్రంలోని టైర్ 2 నగరాల్లో ఐటీ కంపెనీలు తమ యూనిట్లను ప్రారంభిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్లలో ఐటీ పార్కులను ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
మారుమూల ఆదిలాబాద్ నగరానికి ఐటీ సంస్థలు విస్తరించడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. బిఎన్డిటి ల్యాబ్స్కు భవన నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారానికి తెలంగాణ ప్రభుత్వం రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చినా వాటిని పునరుద్ధరించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చొరవ చూపడం లేదని విమర్శించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎ. ఇంద్రకరణ్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్ కేటీఆర్ వెంట ఉన్నారు.
Related News
KCR-KTR: ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ మృతి.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం
KCR-KTR: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ కు ఆయన విశేష సేవలందింరు. ఆయన మృతి వల్ల బీఆర్ఎస్ కు, ఖమ్మం జిల్లాకు తీరని లోటు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, �