Kohli 100: కోహ్లీ కోసం గ్రౌండ్ కు వారిద్దరూ…
టెస్టు కెరీర్ లో విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు.
- By Naresh Kumar Published Date - 09:20 AM, Fri - 4 March 22
టెస్టు కెరీర్ లో విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. ఇటీవలే పరిమిత ఓవర్లతో పాటు టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలకడంతో ఈ మాజీ కెప్టెన్ 100టెస్టుపై మ్యాచ్ పై ఆసక్తి పెరిగిపోయింది మొహాలీ వేదికగా మార్చి 4న జరిగే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తుంది. కాగా ఈ మ్యాచ్ కోసం 50 శాతం మంది అభిమానులను అనుమతించడంతో ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
కరోనా వైరస్ నేపథ్యంలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతి ఇవ్వడం లేదని బీసీసీఐ తొలుత ప్రకటించింది. కాగా, కోహ్లికి కెరీర్లో చిరస్మరణీయంగా మిగిలిపోయే ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతివ్వాలని అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కు పలువురు ప్రత్యేక అతిథులు హాజరు కానున్నారు.బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, పలువురు మాజీ క్రికెటర్లు కూడా హాజరవుతున్నారు.
ఇక కోహ్లీకి ఎంతో ప్రత్యేకమయిన ఏ మ్యాచ్ ను ప్రతక్షంగా చూసేందుకు భార్య అనుష్క శర్మ , కోహ్లీ తల్లి వస్తున్నారు. కోహ్లీ కుటుంబ సభ్యుల కోసం ఇప్పటికే వీవీఐపీ బాక్స్ కేటాయించామని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. బ్రేక్ టైంలో కోహ్లినీ సత్కరించనున్నట్టు వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఈ చారిత్రక మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇటు సోషల్ మీడియాలో కోహ్లీ వందో టెస్ట్ మ్యాచ్ ట్రెండింగ్ లో ఉంది. ఇటు సహచర ఆటగాళ్ళు తమ తమ వాట్సాప్ గ్రూప్ లో కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు.
Related News
Pak vs Ire: చెలరేగిన బాబర్ – రిజ్వాన్.. టీమిండియాకు హెచ్చరికలు
బాబర్ మాట్లాడుతూ.. మా ప్రత్యర్థి భారత్ అని, కోహ్లీని అవుట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లు చెప్పాడు. దీంతో రానున్న మెగా టోర్నీలో బాబర్ సేన టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నిజానికి పాకిస్తాన్ భారత్ తో ఆడాలని ఆరాటపడుతుంది