Cricket Betting : ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన బెజవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు
విజయవాడలో ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న
- Author : Prasad
Date : 27-10-2022 - 9:53 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడలో ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు అయింది. క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పటమట టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 10 సెల్ ఫోన్లు ఉన్న కమ్యూనికేషన్ లైన్ బాక్సులు 2, రెండు ల్యాప్ టాప్ లు, 10 సెల్ ఫోన్లు, రూ.2,40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, తణుకు, చేబ్రోలు, కైకవరం, నిడదవోలుకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇండియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న సమయంలో టాస్క్ఫోర్స్ పోలీసులు పక్కా ప్లాన్తో పట్టుకున్నారు. క్రికెట్ మజా 11, క్రికెట్ ఎక్స్చేంజ్ యాప్ ల ద్వారా వీరు బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.