Old Vehicles: 15 ఏళ్లు దాటిన వాహనాలు ఇక తుక్కుకే!
15 సంవత్సరాలు దాటిన వాహనాలను వచ్చే ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా పరిగణించనున్నారు.
- By Balu J Published Date - 11:35 AM, Fri - 20 January 23
15 సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను వచ్చే ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా పరిగణించనున్నారు. వాటి రిజిస్ట్రేషన్లను ఉపసంహరించనున్నారు. ట్రాన్స్పోర్టు కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులకూ ఈ నిబంధన వర్తించనుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సైన్యం, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం వినియోగించే వాహనాలకు మినహాయింపు ఇచ్చింది.
Related News
MGNREGA: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వేతన రేటు పెంపు..!
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమతిని అందజేసింది.