Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. భక్తులకు అందుబాటులోకి వచ్చినవడ ప్రసాదం?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువ శాతం దర్శించుకునే పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం మల్లికార్జున దేవస్థానం కూడా ఒకటి. నిత్యం స్వామి వారిని వేల
- By Nakshatra Published Date - 06:00 PM, Fri - 16 June 23
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువ శాతం దర్శించుకునే పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం మల్లికార్జున దేవస్థానం కూడా ఒకటి. నిత్యం స్వామి వారిని వేలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి కార్తీక మాసం మాఘమాసం వంటి విశేష రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే మొన్నటి వరకు శ్రీశైలంలో భక్తులకు కేవలం పులిహోర లడ్డూ ప్రసాదాలను మాత్రమే అందించారు.
ఇదివరకటి రోజుల్లో లడ్డు పులిహోర తో పాటుగా వడ ప్రసాదం కూడా అందించేవారు. కానీ ప్రసాదం ఇవ్వడాన్ని చాలా మానేశారు. ఇది ఇలా ఉంటే శ్రీశైలం మల్లన్న భక్తులకు తాజాగా ఆలయ అధికారులు మంచి శుభవార్తను తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానం వడ ప్రసాదం అందుబాటులోకి తెచ్చింది. ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద లడ్డూ, పులిహోరలతో పాటు వడ ప్రసాదం కూడా కొనుగోలు చేయొచ్చునని దేవస్థానం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. 45 గ్రాముల వడ ప్రసాదం ధర రూ.20గా నిర్ణయించారు. శుక్రవారం నుంచి వడ ప్రసాదం విక్రయం ప్రారంభించారు.
మొదట ఈవో ఎస్ లవన్న డ ప్రసాదం కొనుగోలు చేసి వాటి విక్రయాలకు శ్రీకారం చుట్టారు. కాగా ఈ సందర్భంగా ఈఓ లవన్న మాట్లాడుతూ.. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు వడ ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలని సంబంధిత విభాగం సిబ్బందిని,అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రసాదాల విక్రయ విభాగపు పర్యవేక్షురాలు పీ దేవిక, గుమస్తా జీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మీదట కూడా లడ్డు, పులిహోరతో పాటు వడప్రసాదం ని కూడా భక్తులకు అందిస్తామని ఆయన తెలిపారు. కాబట్టి శ్రీశైలం కు వెళ్లే మల్లన్న భక్తులు ఇదివరకటిలాగే వడ ప్రసాదాన్ని కొనుగోలు చేయవచ్చు.
Related News
Pawan Kalyan : జగన్ కు పదవి గండం ఉందని ఆ మహా కుంభాభిషేకం చేయడం లేదు
శ్రీశైలంలో దక్షిణాయణంలో మల్లికార్జున స్వామి కి మహా కుంభాభిషేకం చేస్తే జగన్ కు పదవి గండం ఉందని కొందరు జ్యోతిష్యులు చెప్పడంతో గత రెండుసార్లు వాయిదా వేశారని..పవన్ పేర్కొన్నారు