Air India: ఎయిర్ ఇండియాకు భారీ షాక్..!
భారత ఎయిర్లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా 121.5 మిలియన్ డాలర్లు కట్టాలని యూఎస్ ఆదేశించింది.
- By Gopichand Published Date - 01:10 PM, Tue - 15 November 22
భారత ఎయిర్లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా 121.5 మిలియన్ డాలర్లు కట్టాలని యూఎస్ ఆదేశించింది. దాంతో పాటుగా మరో 1.4 మిలియన్ డాలర్లు ఫైన్గా కట్టాలని, ఇది తమ ప్రయాణికులకు రిఫండ్ ఇవ్వడంలో ఆలస్యం చేసినందుకు జరిమానా అని యూఎస్ పేర్కొంది. అయితే ఎయిర్ ఇండియాతో సహా మొత్తం 6 ఎయిర్ లైన్స్ సంస్థలను 600 మిలియన్ డాలర్లు కట్టాల్సిందిగా యూఎస్ ఆదేశించింది.
కరోనా మహమ్మారి సమయంలో విమానాలను రద్దు చేయడం లేదా మార్చడం వల్ల ప్రయాణీకులకు రీఫండ్లను అందించడంలో తీవ్ర జాప్యం చేసినందుకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు $ 121.5 మిలియన్లు, జరిమానాగా $ 1.4 మిలియన్లు చెల్లించాలని అమెరికా ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం $600 మిలియన్లకు పైగా వాపసు చెల్లించేందుకు అంగీకరించిన ఆరు విమానయాన సంస్థలలో ఎయిర్ ఇండియా కూడా ఒకటి అని US రవాణా శాఖ తెలిపింది.
ఎయిర్ ఇండియా “రిఫండ్ ఆన్ రిక్వెస్ట్” విధానం రవాణా శాఖ విధానానికి విరుద్ధం. ఇది రద్దు చేసినా లేదా విమానంలో మార్పు చేసినా చట్టబద్ధంగా టిక్కెట్లను వాపసు చేయాలని ఎయిర్ క్యారియర్లను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. అయితే రిఫండ్ విధానంలో అమెరికాకు, ఎయిర్ ఇండియా పాలసీలో తేడాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి సమయంలో ఎయిర్ ఇండియా సంస్థను అప్పటికి టాటా సంస్థ టేకోవర్ తీసుకోలేదు. 1,900 ఫిర్యాదులలో సగానికి పైగా ప్రాసెస్ చేయడానికి ఎయిర్ ఇండియా 100 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టిందని అమెరికా అధికారులు ఆరోపించారు.
అంతేకాకుండా ఆ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఎయిరిండియా అప్డేట్ చేయకపోవడంతో అమెరికా రవాణా విభాగం ఎయిరిండియాకు జరిమానా విధించింది. ప్రయాణికులకు చెల్లించాల్సిన రీఫండ్ల మొత్తం 121.5 మిలియన్ డాలర్లతో పాటు 1.4 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఎయిరిండియాను అమెరికా అధికారులు ఆదేశించారు. ఫ్రంటియర్, టీఏపీ పోర్చుగల్, ఏరో మెక్సికో, ఈఐ ఏఐ, అవియానికా సంస్థలకు కూడా ఈ జరిమానా కట్టే లిస్టులో ఉన్నాయి.
Related News
Air India Flight: ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం.. 180 మంది ప్రయాణికులు సేఫ్
మహారాష్ట్రలోని పూణె విమానాశ్రయంలో గురువారం (మే 16) పెను ప్రమాదం తప్పింది.