Kakinada: కాకినాడ బీచ్ లో ఇద్దరు మత్స్యకారులు గల్లంతు
ఐదుగురు మత్స్యకారులు చేపల వేటకు వాకలపూడి బీచ్ నుంచి ఫైబర్ బోటులో సముద్రంలోకి బయలుదేరారు.
- By Balu J Published Date - 04:28 PM, Tue - 21 November 23
Kakinada: కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో మత్స్యకారులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. దీంతో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం ఐదుగురు మత్స్యకారులు చేపల వేటకు వాకలపూడి బీచ్ నుంచి ఫైబర్ బోటులో సముద్రంలోకి బయలుదేరారు. తిరిగి వస్తుండగా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒక్కసారిగా భారీ గాలులు వీచాయి.
దానికి తోడు అధిక ఆటుపోట్లు రావడంతో వాటి తాకిడికి పడవ బోల్తా పడింది. మరికొద్ది గంటల్లో ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉండగా, ప్రమాదం జరగడంతో ముగ్గురు మత్స్యకారులు ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ఇద్దరు సత్తిరాజు, మైలపల్లి కృపాదాలు అదృశ్యమయ్యారు. రెస్క్యూ అధికారులు మంగళవారం గాలింపు ప్రారంభించారు.
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.