KTR: TSPSC ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో సమగ్ర విచారణ జరుపాలి
లీకేజీ వ్యవహారం విషయమై పోలీసు విచారణ జరిపించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు.
- By Balu J Published Date - 10:39 AM, Thu - 16 March 23

TSPSC ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం విషయమై పోలీసు విచారణ జరిపించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. రెండవ నిందితుడు అట్ల రాజశేఖర్ చురుకైన బిజెపి కార్యకర్త అని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన అనేక ఆధారాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి యొక్క స్వంత సోషల్ మీడియా పోస్ట్లతో పాటు, ఇతర బిజెపి కార్యకర్తలతో ఆయన కలిసున్న ఫోటోలు కూడా ఉన్నాయి.
అతనికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో సంబంధం ఉన్నట్లు నివేదికలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఇది బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనం. అని ఆరోపించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికే బీజేపీ అమాయక యువత జీవితాలను నాశనం చేసేందుకు కుట్ర పన్నినట్లుంది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా విచారించి నేరస్తులను గుర్తించాలని నేను తెలంగాణ డిజిపి గారిని అభ్యర్థిస్తున్నాను…” అని కేటీఆర్ అన్నారు.

Related News

Orange Army: సన్ రైజ్ అయ్యేనా.. ఆరెంజ్ ఆర్మీ పై అంచనాలు
ఐపీఎల్ లో టైటిల్ కొట్టే సత్తా ఉన్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ముందు వరుసలో ఉంటుంది. గత సీజన్ తో మాత్రం చెత్త ఆటతీరుతో 8 స్థానంతో సరిపెట్టుకున్న..