Tomatoes : సబ్సిడీపై రూ.50 కిలో టమాట
తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని రైతు బజార్లలో ప్రభుత్వం కిలో రూ.50 రాయితీపై టమాట విక్రయాలను ప్రారంభించింది. జిల్లా
- By Prasad Published Date - 07:46 AM, Wed - 12 July 23
తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని రైతు బజార్లలో ప్రభుత్వం కిలో రూ.50 రాయితీపై టమాట విక్రయాలను ప్రారంభించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కిలో టమాట ధర రూ.100 వరకు పెరగడంతో ప్రజల సౌకర్యార్థం సబ్సిడీ ధరకు విక్రయించామన్నారు. చిత్తూరు జిల్లా పలమలేరు నుంచి 7వేల కిలోల టమోటాలు తెప్పించామన్నారు. ఈ స్టాక్తో అన్ని రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు సబ్సిడీపై టమోటాలు విక్రయించబడతాయని తెలిపారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.సునీల్ వినయ్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న డిమాండ్ ను రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అందుకు అనుగుణంగా దిగుమతులు చేస్తున్నామన్నారు. ఒక్కో కుటుంబానికి కిలో టమాటను సబ్సిడీపై అందజేస్తున్నారు. టమాటా ధర తగ్గే వరకు రైతుబజార్ల ద్వారా విక్రయాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరంలోని వివిధ రైతుబజార్లలో సబ్సిడీ టమోటాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.