Tilak Varma: బేబీ ఏబీడీని టీజ్ చేసిన తిలక్ వర్మ
ఐపీఎల్ 2022 సీజన్ లో టీమిండియా అన్క్యాప్డ్ ప్లేయర్ తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. అండర్-19 ప్రపంచకప్, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ
- By Hashtag U Published Date - 04:35 PM, Wed - 4 May 22
ఐపీఎల్ 2022 సీజన్ లో టీమిండియా అన్క్యాప్డ్ ప్లేయర్ తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. అండర్-19 ప్రపంచకప్, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మను, ఫిబ్రవరిలో జరిగిన మెగావేలంలో ముంబై ఇండియన్స్ రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసింది. తక్కువ ధరకే అమ్ముడైన ఈ యంగ్ క్రికెటర్ ముంబై ఇండియన్స్కు మాత్రం పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్లలో 307 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
అయితే తాజాగా తిలక్ వర్మ సహచర ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను ఆటపట్టించిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ముందుగా బిస్కట్లలో క్రీమ్ తీసేసిన తిలక్ వర్మ.. అందులోటూత్ పేస్ట్ను రాశాడు. ఆ తర్వాత మళ్లీ ఆ బిస్కెట్ ప్యాకెట్ ను ఎలా ఉండేదో అలా ప్యాక్ చేసి.. తన తోటి ఆటగాళ్ల దగ్గరికి తినమంటూ అడిగాడు. అయితే తిలక్ వర్మ ప్లాన్ తెలియని డెవల్డ్ బ్రెవిస్, రిలే మెరెడిత్ , టిమ్ డేవిడ్, వాటిని లొట్టలేసుకుంటూ తినేశారు. అయితే, వాళ్ళు బిస్కెట్లను పూర్తిగా తిన్న తరువాత అందులో టూత్ పేస్ట్ కలిపిన విషయాన్ని తిలక్ వర్మ వెల్లడించాడు. దాంతో షాకైన ఆ ముగ్గురు ఆటగాళ్లు ఘొల్లున నవ్వేశారు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక ఖాతా ద్వారా అభిమానులతో పంచుకోగా.. ముంబై ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఐపీఎల్-2022లో ఎట్టకేలకు తొలి విజయం అందుకున్న ముంబై జట్టు తమ తర్వాతి మ్యాచ్ ను మే 6న గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది.
Related News
Mumbai Win: ముంబై మళ్లీ గెలుపు బాట.. ఉత్కంఠ పోరులో పంజాబ్ పై విజయం
ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది.