Hyderabad: విషాదం.. చెరువులో దిగి ముగ్గురు బాలురు మృతి.!
హైదరాబాద్ లోని నానక్రామ్గూడలో విషాదం నెలకొంది.
- By Gopichand Published Date - 06:05 PM, Sat - 19 November 22
హైదరాబాద్ లోని నానక్రామ్గూడలో విషాదం నెలకొంది. గోల్ఫ్ కోర్స్ వద్ద చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులు గచ్చిబౌలిలోని టెలికాంనగర్కు దిలీప్, పవన్, షాబాద్లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా 12ఏళ్ల లోపు వారేనని చెప్పారు. ఈత కొట్టేందుకు చెరువులో దిగి.. వారు మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
టెలికాం గచ్చిబౌలికి చెందిన దీపక్ (12), షాబాజ్ (15), పవన్ (13)లు ఆడుకునేందుకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నానక్రామ్గూడ రోటరీ వద్ద ఉన్న పటేల్ కుంట ట్యాంకు వద్దకు వెళ్లారు. చెరువు దగ్గర ఆడుకుంటుండగా ముగ్గురూ ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జి. సురేష్ తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Related News
HYD : ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్నోడిని కడతేర్చిన ఇల్లాలు
బోరబండకు చెందిన రాజేశ్ తో శ్రీలక్ష్మి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. అయితే వీరిద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన శ్రీలక్ష్మి.. చంపించాలని ప్లాన్ వేసింది