Viral: రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు, వీడియో వైరల్
- By Hashtag U Published Date - 01:51 PM, Wed - 21 June 23
ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పుర్ రైల్వేస్టేషనులో 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న పాటలీపుత్ర ఎక్స్ప్రెస్ రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల మేర ప్లాట్ఫాం మీద అలాగే జారుతూ రైలుతోపాటు ముందుకు వెళ్లాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషనులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎట్టకేలకు ఆ యువకుడు సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. చిన్నగాయం కూడా లేకుండా ఈ ఘటన అనంతరం అతడు లేచి నిలబడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Related News
UP : భర్త మర్మాంగాన్ని సిగరెట్ తో కాల్చిన భార్య..అంతే కాదు..!!
దుస్తులు విప్పేసి అతడి మీద కూర్చొని సిగరెట్ తాగుతూ.. సిగరెట్తో అతడి శరీరాన్ని కాల్చడం చేసింది. అక్కడితో ఆగకుండా.. ఓ కత్తితో అతడి మర్మాంగాన్ని కత్తిరించే ప్రయత్నం చేసింది