HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Terrible In Pakistan 8 Teachers Killed In Firing

Pakistan: పాకిస్తాన్‌లో ఘోరం.. కాల్పుల్లో 8 మంది టీచర్లు హతం

పాకిస్తాన్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఏడుగురు ప్రభుత్వం ఉపాధ్యాయులు కాల్చివేతకు గురయ్యారు. కొంతమంది దుండగులు ప్రభుత్వ పాఠశాలలోనే

  • Author : Anshu Date : 04-05-2023 - 10:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakis
Pakis

Pakistan: పాకిస్తాన్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఏడుగురు ప్రభుత్వం ఉపాధ్యాయులు కాల్చివేతకు గురయ్యారు. కొంతమంది దుండగులు ప్రభుత్వ పాఠశాలలోనే అందరూ చూస్తుండగా ఉపాధ్యాయులను దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటన ఖైబర్ ఫక్తుంబ్వా కుర్రమ్ తహసిల్‌లోని తరి మంగళ్ గవర్నమెంట్ స్కూల్‌లో జరిగింది. గన్‌లు పట్టుకుని పాఠశాలలోని స్టాఫ్‌రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ ఉన్న ఏడుగురు ఉపాధ్యాయులు ఒక్కసారిగా దుండగులు అందరూ కలిసి కాల్పులు జరిపారు.

ఉపాధ్యాయులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు ఉపాధ్యాయులు అక్కడిక్కడే మరణించారు. ఇక ఇలాంటి ఘటన మరో ప్రాంతంలో కూడా చోటుచేసుకుంది. పరాచినార్ ప్రాంతంలో మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని స్కూల్‌లోని అందరి ముందే కాల్చివేశారు. దీంతో కాల్పుల్లో ఒక్కరోజులోనే మరణించిన ప్రభుత్వ టీచర్ల సంఖ్య 8కు చేరుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా ప్రభుత్వ పాఠశాలలోనే ఉపాధ్యాయులను కాల్చి చంపేయడం పాకిస్తాన్ లో కలకలం రేపుతోంది.

అయితే ఇది ఉగ్రవాదుల పని అంటూ కొంతమంది చెబుతున్నారు. కానీ దీనికి తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన జారీ చేయలేదు. పాకిస్తాన్ లో ఇప్పటికే ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొంది. నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బ్రతకలేని పరిస్థితి నెలకొంది. ఇక సంక్షోభం క్రమంలో శాంతి భద్రతలు కూడా అదుపు తప్పాయి. ఒకవైపు ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో ఇప్పుడు శాంతి భద్రతలు కూడా అదుపు తప్పడం అక్కడి ప్రజలను కలవరపరుస్తుంది.

అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులను చంపడానికి కారణం ఏంటనే దానిపై ఇప్పటివరకు ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో అక్కడి పోలీస్ అధికారులు దీనిపై విచారణ చేపడుతున్నారు. ఈ కాల్పుల ఘటనలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pakistan

Related News

    Latest News

    • రేప్ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే

    • అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?

    • సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు, ఇది సాధ్యమేనా?

    • రవితేజ నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్ తోనేనా ?

    • భోగి మంటలు విషయంలో జాగ్రత్తలు అవసరం !

    Trending News

      • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

      • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

      • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

      • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

      • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd