HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana Decides To Procure Paddy Produced In Yasangi

Telangana Farmers:తెలంగాణ రైతాంగానికి శుభవార్త…ధాన్యం తామే కొంటామన్న సీఎం కేసీఆర్..!!

తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని తామే కొనుగోలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.

  • Author : Hashtag U Date : 12-04-2022 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

తెలంగాణ రైతులకు తీపికబురు చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని తామే కొనుగోలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. కొనుగోళ్ల కోసం చీఫ్ సెక్రటరీ ఆద్వర్యంలో కమిటీ వేశామన్నారు. యాసంగిలో పండించిన ప్రతిగింజను రాష్ట్ర సర్కారే కొంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. 3, 4 రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఒక్క గింజను కూడా తక్కువ ధరకు అమ్మెుద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి.

పనికిమాలిన…దిక్కుమాలిన కేంద్ర సర్కార్ మోసం చేసినంత మాత్రానా..తామూ చూస్తూ ఉరుకోమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతిగ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. రూ. 1960 మద్దతు ధరకు ధాన్యం కొంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మతపిచ్చితో దేశం భారీ మూల్యం చెల్లించాల్సిందేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు మతోన్మాదుల కుట్రలో పడితే దేశం వందేళ్ల వెనక్కి వెళ్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు చేయలేక కేంద్రం చేతులెత్తేసిందని మండిపడ్దారు. దేశాన్ని చైతన్య పరిచే ఉద్యమంలో తాను ఖచ్చితంగా కీలకపాత్ర పోషించి తీరుతానని ముఖ్యమంత్రి తెలిపారు.

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు బుద్ది ఉందా అంటూ మండిపడ్డారు. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రం అనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ల సిద్దాంతమన్నారు. రాష్ట్రాలను పెట్రోల్ పై పన్నులు తగ్గించాలంటున్న కేంద్రం…వాటిపై ఎందుకు పన్నులు తగ్గించదని తనదైన శైలిలో ప్రశ్నించారు. 30 నుంచి 35 శాతం నూకల వల్ల వచ్చే నష్టాన్ని భరించేందుకు ఇంత రచ్చ చేస్తారా అని ఫైరయ్యారు. కేంద్రానికి తన బాధ్యత గుర్తుచేయడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఒక చిన్న రాష్ట్రం నుంచి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం వద్ద డబ్బులు లేవా అని ముఖ్యమంత్రి నిలదీశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • paddy purchase
  • Telangana cabinet decision
  • telangana government
  • yasangi

Related News

    Latest News

    • IND vs SA: మూడో టీ20లో సౌతాఫ్రికాపై భార‌త్ ఘ‌న‌విజ‌యం!

    • LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందో తెలుసా?!

    • Newborn Baby: నవజాత శిశువును ఎలా నిద్ర పుచ్చాలి?

    • Sachin Meets Messi: మెస్సీని కలిసిన సచిన్ టెండూల్కర్.. వీడియో వైర‌ల్‌!

    • IND U19 vs PAK U19: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం!

    Trending News

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

      • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

      • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

      • Messi Mania: నేడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌.. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు రాహుల్ గాంధీ రాక‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd