HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Teen Dies Of Food Poisoning 18 Other Hospitalised After Consuming Shawarma In Kasaragod

Food Poisoning: విద్యార్థిని ప్రాణాలు తీసిన షవర్మ.. మరో 18 మందికి ఆసుపత్రిలో చికిత్స

ఈరోజుల్లో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు.

  • By Hashtag U Published Date - 10:17 AM, Mon - 2 May 22
  • daily-hunt
student hospitalised
student hospitalised

ఈరోజుల్లో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. అందుకే బయట వేడివేడిగా ఏది కంటికి ఇంపుగా కనిపిస్తే దానిని తినేస్తున్నారు. కేరళలోని కాసరగోడ్ జిల్లాలో కొందరు విద్యార్థులు కూడా అలాగే షవర్మా తిందామనుకున్నారు. దీంతో ఒకరు కాదు.. ఇద్దరు కాదు. మొత్తం 19 మంది విద్యార్థులు దానికోసం బయలుదేరారు. కానీ వారిలో ఒకరికి అదే షవర్మా ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయారు.

చెరువత్తూరులో ఉన్న ఓ స్కూల్ కు చెందిన విద్యార్థులు సరదాగా ఫాస్ట్ ఫుడ్ తిందామనుకున్నారు. అలా అనుకునే 19 మంది స్టూడెంట్స్ తమకు దగ్గరలో ఉన్న ఓ షాప్ కి వెళ్లారు. అక్కడే షవర్మా కూడా ఉంది. దీంతో విద్యార్థులంతా ఆ షవర్మాను తిన్నారు. తరువాత జ్యూస్ తాగారు. కానీ అది కలుషిత ఆహారం కావడంతో వాళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో కరివళ్లూర్ కు చెందిన 16 ఏళ్ల దేవానంద అనే బాలిక కన్హాన్ గడ్ లోని జిల్లా హాస్పటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది.

ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఇతర విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉంది. ఈ ఘటనపై ఆందోళన చెందిన తల్లిదండ్రులతోపాటు ఆ స్కూల్ యాజమాన్యం.. ఈ ఘటనకు ఆ హోటలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. పోలీస్ కేసు పెట్టారు. కేసు సీరియస్ గా మారడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.

కేరళ రాష్ట్ర మంత్రి ఎంవీ గోవిందన్ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మొత్తం వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. బాధిత విద్యా్ర్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రభుత్వం చెప్పింది.

షవర్మా అనేది లెవాంటైన్ వంటకం. మాంసాన్ని తీసుకుని దానిని చిన్న చిన్న ముక్కలుగా తరుగుతారు. దానిని బన్ లో పెట్టి బేక్ చేసి ఇస్తారు. కేరళలో ఇది చాలా సంవత్సరాలుగా ఉంది. చాలామంది ఇష్టంగా తింటారు. హైదరాబాద్ లో కూడా చాలా షాపులు ఉన్నాయి. కాకపోతే అలా అందిస్తున్న ఆహారంలో నాణ్యతపైనే అందరిలో ఆందోళన నెలకొంది.

Kerala | A student dies after consuming rotten shawarma in Kasaragod district. A total of 18 students have been admitted to the district hospital. The shop has been closed, cook taken into custody. Food poisoning may be the primary reason for this: M Rajagopalan, MLA Trikaripur pic.twitter.com/LKYdZo30oN

— ANI (@ANI) May 1, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kasargod
  • kerala
  • shawarma
  • teen dies

Related News

Onam Celebrations Sad

Shocking Video : ఓనం వేడుకలో డ్యాన్స్ కుప్పకూలి ఉద్యోగి మృతి

Shocking Video : కేరళలోని రాష్ట్ర విధానసభలో ఓనం పండుగ వేడుకలు ఉత్సాహంగా జరుగుతుండగా ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగులందరూ కలిసి సంబరాలు చేసుకుంటున్న ఈ సమయంలో, డ్యాన్స్ చేస్తున్న జూనేష్ అబ్దుల్లా (45) అనే ఉద్యోగి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

    Latest News

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd