HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Janasena Discuss Ap Development Parliament Strategy

CM Chandrababu: పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో, టీడీపీ ఎంపీలకు వ్యూహాత్మక సూచనలు అందించారు. ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కీలక ప్రాజెక్టుల పురోగతి, అలాగే రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.

  • Author : Kavya Krishna Date : 23-11-2024 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu Parliamentary Meeting
Cm Chandrababu Parliamentary Meeting

CM Chandrababu: తన ఉండవల్లి నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో, టీడీపీ ఎంపీలకు వ్యూహాత్మక సూచనలు అందించారు. ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కీలక ప్రాజెక్టుల పురోగతి, అలాగే రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సమావేశంలో, కేంద్రం సహకారంతో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, వివిధ ప్రాజెక్టుల అనుసంధానం వంటి అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. చంద్రబాబు మాట్లాడుతూ, “స్వర్ణాంధ్రప్రదేశ్ 2047” అనే అభివృద్ధి లక్ష్యాలను ప్రతిపాదించారు. ఇందులో కేంద్ర అనుసంధానం ద్వారా పూర్తిచేయవలసిన ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే 25 కొత్త పాలసీల రూపకల్పనకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు:
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, నదుల అనుసంధానం వంటి అంశాలపై చర్చించామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “పెట్టుబడుల కోసం కేంద్రం సహకారాన్ని పొందే విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక సూచనలు చేశారు. రాష్ట్రానికి ఆర్ధిక స్థిరత్వం తీసుకురావడంలో చంద్రబాబు ముందుండి నడుస్తున్నారు” అని చెప్పారు. జగన్ ప్రభుత్వం నడిచే తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ, “ఆర్థిక అసమతుల్యతకు జగన్ ఒక ఎస్కోబార్ లా తయారయ్యారు” అని వ్యాఖ్యానించారు.

లావు కృష్ణదేవరాయులు వ్యాఖ్యలు:
టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు మాట్లాడుతూ, చంద్రబాబు పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలను ప్రాధాన్యంగా చర్చించాలని సూచించారని తెలిపారు. “ఏపీ పరిస్థితులపై ప్రతిపక్ష సభ్యులకు కూడా అవగాహన కల్పించామనీ, పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులు, నదుల అనుసంధానం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించామని” అన్నారు. అలాగే, పార్లమెంట్‌లో రాబోయే బిల్లులపై కూడా చర్చ జరగడం విశేషమని ఆయన వెల్లడించారు.

జనసేన ఎంపీలతో పవన్ కల్యాణ్ భేటీ:
మరోవైపు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, క్యాంపు కార్యాలయంలో తన పార్టీ ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీలు బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో జరిగిన ఈ సమావేశంలో, పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన ముఖ్య అంశాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులపై దిశానిర్దేశం చేశారు. పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఒత్తిడి తీసుకురావాలని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి కేంద్రంతో సమన్వయం కీలకమని పవన్ హితవు పలికారు. ఈ రెండు సమావేశాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం తోడ్పాటుతో రాష్ట్రానికి మరింత ప్రాధాన్యతనందించడానికి చర్చలు జరిపిన విధానం స్పష్టంగా చెబుతున్నాయి. ఏపీని అభివృద్ధి దిశగా నడిపించేందుకు, టీడీపీ , జనసేన తమ కూటమి వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయాలని నిర్ణయించాయి.

Vitamin D : సూర్యకాంతి ద్వారా విటమిన్ డి ఏ సమయంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Development
  • chandrababu naidu
  • Industrial Policies
  • Janasena
  • Parliament Strategy
  • Pawan Kalyan
  • polavaram
  • River Linking
  • Swarna Andhra Pradesh
  • tdp

Related News

Pawan Dimsa Dancce

సంక్రాంతి వేడుకలు : ధింసా నృత్యం చేసిన పవన్ కళ్యాణ్

పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించారు. అక్కడున్న డోలు కళాకారులను ఆప్యాయంగా పలకరించి గిరిజనులతో ఉత్సాహంగా ధింసా నృత్యం చేశారు. అనంతరం సామూహిక సీమంతాల కార్య క్రమంలో పాల్గొని గర్భిణులకు పండ్లు

  • Sakshi Vaidya

    పవన్ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. ఆ కారణంగానే మూవీ వద్దు అన్నాను : సాక్షి వైద్య

  • Ap Avakaya Festival

    రేపటి నుండి విజయవాడ లో ‘ఆవకాయ- అమరావతి’ ఉత్సవాలు

  • Kondagattu Giri Pradakshina

    కొండగట్టు గిరి ప్రదక్షిణకు గ్రీన్ సిగ్నల్

  • Pawan Kalyan Narrowly Escap

    కొండగట్టు లో పవన్ కళ్యాణ్ కు తప్పిన పెను ప్రమాదం

Latest News

  • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

  • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

  • రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలివే..!

  • కుబేర యోగం అంటే ఏమిటి?..జాతకంలో యోగం లేకపోతే చేయాల్సింది ఏమిటి?

  • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd