NCBN: 73 ఏళ్ల పొలిటికల్ శ్రామికుడు
చంద్ర బాబు నాయుడుకి 72 ఏళ్లు పూర్తి అయ్యాయి. 73వ ఏడాదిలోకి అడుగు పెట్టిన ఆయన ఇప్పటికి కుర్రాడి మాదిరిగా శ్రామిస్తుంటారు.
- By CS Rao Published Date - 08:43 AM, Wed - 20 April 22
చంద్ర బాబు నాయుడుకి 72 ఏళ్లు పూర్తి అయ్యాయి. 73వ ఏడాదిలోకి అడుగు పెట్టిన ఆయన ఇప్పటికి కుర్రాడి మాదిరిగా శ్రామిస్తుంటారు. ఏపీ సీఎం గా 15 ఏళ్ళు పనిచేసిన నాయుడు ఇండియా టుడే నుండి IT ఇండియన్ ఆఫ్ ది మిలీనియం, ది ఎకనామిక్ టైమ్స్ ద్వారా బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్, టైమ్ ఆసియా నుండి సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ డ్రీమ్ క్యాబినెట్లో సభ్యత్వం వంటి అనేక అవార్డులను గెలుచుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20, 1950 నాడు ఏపీలోని నారావారిపల్లిలో జన్మించారు. తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి (1995-2004 మరియు 2014-19) సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. రాజకీయాల్లో 40 ఏళ్లకు పైగా అపార అనుభవం ఉన్న నాయుడు భారతదేశంలోని సీనియర్ నాయకులలో ఒకరు. ఆయన సీఎంగా ఉన్న కాలంలో సెప్టెంబర్ 2015లో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ “ఏ విధమైన బడ్జెట్ పెంపుదలలు లేకుండా, సకాలంలో పూర్తి చేశారు. ఫలితంగా దేశంలోనే వేగవంతమైన నీటిపారుదల ప్రాజెక్ట్”గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ప్రవేశించింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) వినియోగాన్ని ఆనాడు నొక్కిచెప్పారు. హైదరాబాద్ను భారతదేశంలోని ఐటి హబ్లలో ఒకటిగా మార్చడంలో కీలకపాత్ర పోషించారు. పబ్లిక్ విధానాలు, పాలనకు సంబంధించిన విధానం కోసం ప్రపంచ నాయకులు, మీడియా నుండి ప్రశంసలు పొందారు. ఇండియా టుడే నుండి IT ఇండియన్ ఆఫ్ ది మిలీనియం, ది ఎకనామిక్ టైమ్స్ ద్వారా బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్, టైమ్ ఆసియా నుండి సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ డ్రీమ్ క్యాబినెట్లో సభ్యత్వంతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు. మే 2017లో ‘ట్రాన్స్ఫార్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డు’తో సత్కరించారు.
బాబు జీవితంలో ఆసక్తికర అంశాలు
*28 ఏళ్ల వయసులో చంద్ర బాబు నాయుడు రాష్ట్రానికి అత్యంత పిన్న వయస్కుడైన అసెంబ్లీ సభ్యుడిగా, మంత్రిగా ఎన్నికయ్యారు.
*నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాసనసభలో మెజారిటీని సాధించింది, అసెంబ్లీలో 294 సీట్లలో 185 మరియు 1999 సార్వత్రిక ఎన్నికలలో 42 సీట్లలో 29, BJP నేతృత్వంలోని NDA సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. .
*2003లో ల్యాండ్ మైన్ పేలుడు సమయంలో హత్యాయత్నం నుంచి తప్పించుకున్నాడు. అతను తన కాలర్బోన్ మరియు హెయిర్లైన్ ఫ్రాక్చర్లకు చీలికలతో బాధపడ్డాడు.
*అతను 1992లో హెరిటేజ్ గ్రూప్ను స్థాపించాడు, ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్-రంగం డెయిరీ ఎంటర్ప్రైజెస్లో ఒకటిగా మారింది.
*భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి (2014-2019). విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు.
*అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. అతను ఇండియా టుడే నుండి “ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం”, ద ఎకనమిక్ టైమ్స్ నుండి “బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్”, టైమ్స్ ఆసియా నుండి “సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్”, ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు. అతను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు.
*నారా చంద్రబాబునాయుడు, ఎన్.టి.రామారావు కూతురు నందమూరి భువనేశ్వరిని పెళ్ళిచేసుకొని నందమూరి కుటుంబంలో భాగమయ్యాడు. ఈయన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి తో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు. వీరి కుమారుడు దేవాన్ష్.
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం విభజన చెందిన తరువాత, నవ్యాంధ్ర కు ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించాడు. *హైదరాబాదు వలె కాకుండా అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐ.టి.సెజ్ – ప్రత్యేక ఆర్థిక జోన్ తో ఐ.టి.హబ్ గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించాడు. అభివృద్ధిలో భాగంగా అతను “ఏ.పి క్లౌడ్ ఇనిషియేటివ్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. డిజిటల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసాడు.
*ప్రధానంగా నగరాలు విదేశీ పెట్టుబడులకు ప్రత్యేకంగా “ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ ఔట్సోర్సింగ్ సర్వీసెస్” వంటి ముఖ్య విభాగాలపై దృష్టి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికోసం చేసిన తన ప్రణాళికపై చర్చించాడు.తన లక్ష్య సాధన కోసం అతను “బై బై బెంగళూర్, హలో హైదరాబాద్” నినాదాన్నిచ్చాడు.
*మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంటు సెంటర్ను స్థాపించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సీయాటెల్ నగరంలో ఉన్న సంస్థ తరువాత ఇది రెండవ కేంద్రం. నాయుడు ఇతర ఐ.టి కంపెనీలను (ఐ.బి.ఎం., డెల్, డెలోఇట్ట్, కంప్యూటర్ అసోసియేట్స్ అండ్ ఓరాకిల్) హైదరాబాదులో నెలకొల్పడానికి ప్రోత్సాహాన్నందించాడు. *హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ సి.ఇ.ఓ లను ఒప్పించేందుకు కృషిచేసాడు. అతని పదవీ కాలం చివరలో 2003-04 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాదు నుండి సాఫ్ట్వేర్ ఎగుమతులు 1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ఇది దేశంలో నాల్గవ అతి పెద్ద ఎగుమతి నగరంగా మారింది. 2013-14 లో ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి.దీని ఫలితంగా హైదరాబాదులో IT & ITES రంగాలలో 320,000 మందికి ఉపాధి లభించింది.
రాష్ట్రపతి ఎన్నికలో పాత్ర
రాష్ట్రపతిగా దళితవర్గానికి చెందిన నారాయణన్ ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకొన్నాడు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజపేయి భావించాడు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చచెప్పి ఒప్పించాడు. *అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా చేసిన కృష్ణకాంత్ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు.
*2003 అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనలో రాష్ట్ర సమాచారశాఖ మంత్రి బి.గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు సి.హెచ్ కృష్ణమూర్తి, కారు డ్రైవరు శ్రీనివాసరాజు లకు కూడా గాయాలైనాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ బాంబుదాడి కేసులో 2014లో ముగ్గురికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు సెప్టెంబర్ 25, 2014, తీర్పు చెప్పింది.
*2015 అక్టోబరు 22న అత్యంత వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు జరిగింది. మోదీతోపాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు కూడా ఒక్కొక్క రత్నం చొప్పున శంకుస్థాపన ప్రదేశంలో ఉంచారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో భారత ప్రధానితో పాటు జపాన్, సింగపూర్ పరిశ్రమల మంత్రులిద్దరూ పాల్గొన్నారు
* 28వ యేట రాష్ట్ర అసెంబ్లీలో అందరికన్నా చిన్నవయసు గల సభ్యుడు, మంత్రి
తెలంగాణ రాష్ట్రం విభజన జరగక పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించినఘనత.
*రాష్ట్ర విభజన తరువాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు తొలిముఖ్యమంత్రిగా 2014 జూన్ 8 నుండి సేవలు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం పరిపక్షనాయకునిగా సేవలు.
*ఇండియా టుడే ద్వారానిర్వహించిన ఓటులో ఐ.టి. ఇండియన్ ఆఫ్ దమిలీనియంగా ఎంపిక.
*టైం మ్యాగజైన్ ద్వారా “సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్”గా గుర్తింపు.
*ఎకనమిక్స్ టైమ్స్ నుండి “బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్”గా గుర్తింపు.
*”సి.ఇ.ఒ ఆఫ్ ఆంధ్రప్రదేశ్”గా ఆయనను పిలుస్తారు.
*2016 జనవరి 30 న పూణే ఆధారిత సంస్థ భారతీయ ఛాత్ర సంసద్, ఎం.ఐ.టి స్కూల్ అపహ్ గవర్నెన్స్ తో కలసి “ఆదర్శ్ ముఖ్యమంత్రి పురస్కారం”.
*మే 2017లో “ట్రాన్స్ఫార్మాటివ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డు”
*మే 2018లో టీటీడీ బోర్డులో జరుగుతోన్న అవకతవకలపై – ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా జరుగుతోన్న పనులపై తాను నోరు మెదిపినందుకే ప్రభుత్వం తనపై కక్ష్య తీర్చుకుంటోందని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేసాడు. శ్రీవారి వంటశాలలోని నేలమాళిగలలో ఉన్నవిలువైన ఆభరాణాలకోసం జరిగిన తవ్వకాల వెనుక చంద్రబాబు హస్తముందని సంచలన ఆరోపణలు చేశాడు.
*డబ్బు అందజేస్తూ తెలుగుదేశం నాయకులు దొరికిపోవటంతో ఈ ఓటుకి నోటు అనే అంశం బాగా పేరుపొందింది. తెలంగాణ అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు జరిగే ఎన్నికల్లో .. ఒక నామినేటెడ్ శాసన సభ్యుని ప్రలోభ పెట్టే ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి స్వయంగా రూ.50 లక్షలు ఇస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఆయన్ని కోర్టు ముందు హాజరు పరిచి, జైలుకి పంపించటం జరిగింది. తర్వాత అదే నామినేటెడ్ శాసన సభ్యునితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంభాషణ అన్న ఫోన్ సంభాషణలు నాటకీయంగా బయటపడ్డాయి. దీని ఫలితంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైద్రాబాదునుండి ఆంధ్రప్రదేశ్ కు మార్చటం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడడం జరిగాయి.
*2024 ఎన్నికల కోసం ముందస్తు ప్లాన్ రెడి చేసిన చంద్రబాబు 73 ఏళ్ల వయసులోనూ అలుపులేకుండా పని చేస్తారు. పని రాక్షసునిగా పేరున్న చంద్రబాబుకు హష్టాగ్ యూ తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Related News
AP Funds : పథకాల నిధులు పక్కదారి.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు..!
పోలింగ్ ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు.