TTD: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి రథోత్సవం
- By Balu J Published Date - 02:59 PM, Thu - 13 January 22
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి బంగారు రథంపై తిరువీధుల్లో విహరించారు. స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వర్ణ రథాన్ని లాగారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు, సెలబ్రిటీలు తిరుమలకు క్యూ కడుతున్నారు. ఏకాదశి రోజున శ్రీవారిని సందర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో ప్రముఖుల తాకిడి పెరిగింది. నెల్లూరులో పెన్నా తీరాన వెలిసిన తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయంలో… శ్రీరామచంద్రుడు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు అభయమిచ్చారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
Tags
Related News
TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం
TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదై�