TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త…ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి ఎప్పటినుంచో తెలుసా..?
తిరుమలకు ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులకు పలు రూపాల్లో టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంది.
- By Hashtag U Published Date - 12:35 PM, Tue - 8 March 22

తిరుమలకు ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులకు పలు రూపాల్లో టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంది. సర్వదర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, ఆర్జిత సేవల ద్వారా స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు. కోవిడ్ విజృంభించక ముందుకు ఈ విధంగా దర్శనం సాగింది. కోవిడ్ తర్వాత తిరుమలలో ఇందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటిస్తూ…మాస్కులు తప్పనిసరిగా ధరిస్తూ దర్శనం చేసుకునేవారు. పరిమిత సంఖ్యలోనే స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తోంది.
ఆన్ లైన్లో పరిమిత సంఖ్యలోనే టికెట్లు విడుదల చేసి ప్రత్యేక దర్శనం కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సిఫార్సే లేఖలు వర్చువల్ ఆర్జిత సేవ టికెట్లు కలిగిన భక్తులకు తిరుమలకు అనుమతిస్తోంది టీటీడీ. కరోనా తగ్గడంతో ఈ నెల 16వ తేదీ నుంచి తిరుతిలో ఆఫ్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తూ భక్తుల సంఖ్యను పెంచేస్తోంది టీటీడీ.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవల్లో భక్తులకు అనుమతి…
అయితే కోవిడ్ వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గుతుండటంతో గత పాలక మండలి సమావేశంలో ఆర్జిత సేవల పున:ప్రారంభించేందుకు పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద, పద్మారాధన, తిరుప్పావడ, మేల్ చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్టిజ బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను అన్నింటినీ శ్రీవారి ఆలయంలోనే నిర్వహిస్తారు. అయితే కోవిడ్ పరిస్థితుల విధానంలోనే ఆర్జిత సేవా టికెట్లు బుకింగ్ ను టీటీడీ కొనసాగించనుంది. ఇక వర్చువల్ సేవలను బుక్ చేసుకున్న భక్తులకు ఆయా సేవల్లో డైరెక్టుగా పాల్గొనే ఛాన్స్ లేదని టీటీడీ స్పష్టం చేసింది. వర్చువల్ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కల్పించడంతో పాటు ప్రసాదాలు మాత్రమే అందించనుంది. అడ్వాన్డ్స్ బుకింగ్ లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న వారిని..ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్న వారు ఏప్రిల 1 నుంచి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయ సేవలకు అనుమతించనుంది టీటీడీ.