AP Assembly: ఎమ్మెల్యేలను సభకు ఫోన్లు తీసుకురావొద్దన్న స్పీకర్.. కారణం ఇదే..?
- By hashtagu Published Date - 09:45 AM, Fri - 18 March 22
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష శాసనసభ్యులు గత నాలుగురోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీసారా మరణాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రతిరోజు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే సభలో లైవ్ టెలికాస్ట్ కాకుండా ఆందోళన జరిగే కార్యక్రమాల విడియోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్పీకర్ శాసనసభ్యులందరూ సభకు సెల్ఫోన్లు తీసుకువెళ్లకుండా స్పీకర్ నిషేధించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ టి సీతారాం సభ్యులు సభలోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించారు, ప్రతిపక్ష టిడిపి శాసనసభ్యులు కార్యక్రమాలను రికార్డ్ చేసి మీడియాకు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారని పీటీఐ తెలిపింది.
Related News
Siddaramaiah : మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. సిద్ధరామయ్య ఆరోపణలు
Siddaramaiah: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) బీజేపి(bjp) పై కర్ణాటకసంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆపరేషన్ కమలంలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలను (Congress MLAs) బీజేపీ పావులుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్