Trains Cancelled: మిచౌంగ్ ఎఫెక్ట్.. 140కి పైగా రైళ్లు రద్దు.. వివరాలివే..
మిచౌంగ్ తుఫాను ప్రభావం లైలా తుఫానుకు మించి ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకూ..
- By News Desk Published Date - 11:24 PM, Sat - 2 December 23
Trains Cancelled: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లో తుఫానుగా రూపాంతరం చెందనుంది. దీనికిఇప్పటికే మిచౌంగ్ అని నామకరణం చేశారు అధికారులు. దీని ప్రభావం ఎక్కువగా కోస్తాంధ్రపై ఉంటుందని, డిసెంబర్ 5వ తేదీ నాటికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మిచౌంగ్ తుఫాను ప్రభావం లైలా తుఫానుకు మించి ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకూ 140కి పైగా ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరికొన్ని రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఏపీపై తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో అధికారులు భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Tags
Related News
Tirupati Trains Alert : తిరుపతికి వెళ్లే వారికి అలర్ట్.. ఆ రైళ్లు దారి మళ్లింపు.. కొత్తరూట్ ఇదీ
Tirupati Trains Alert : ఏటా సమ్మర్ టైంలో తిరుపతికి భక్తులు పెద్దసంఖ్యలో వెళ్తుంటారు.