Smriti: స్మృతి మంధాన చేసిన పనికి ఫాన్స్ ఫిదా!
జెంటిల్ మెన్ గానే క్రికెట్ లో హుందాగా వ్యవహరించే వారు చాలా అరుదుగా కనిపిస్తారు.
- By Naresh Kumar Published Date - 01:37 PM, Sun - 13 March 22
జెంటిల్ మెన్ గానే క్రికెట్ లో హుందాగా వ్యవహరించే వారు చాలా అరుదుగా కనిపిస్తారు. మహిళల క్రికెట్ ను జెంటిల్ వుమెన్ గేమ్ గా భావిస్తే అందులో కూడా హుందాగా వ్యవహరించే వారు కూడా తక్కువే. అయితే ఇతర దేశాల మహిళా క్రికెటర్ల తో పోలిస్తే మంచి వ్యక్తిత్వం ఖచ్చితంగా భారత ప్లేయర్స్ కే ఉంటుందని మరోసారి రుజువైంది. తాజాగా మహిళల వన్డే ప్రపంచకప్లో సెంచరీతో చెలరేగిన టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాననే దీనికి ఉదాహరణ. ఆమె చేసిన పనికి ఫిదా అయిన ఫాన్స్ లవ్ యూ స్మృతి అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే సెంచరీ చేసి విజయంలో కీలక పాత్ర పోషించినదాని కంటే.. మ్యాచ్ అనంతరం మంధాన చేసిన పని ఈ ప్రశంసలకు కారణం.
అసలు సంగతి ఏమిటంటే స్మృతి మంధాన(119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 123), హర్మన్ప్రీత్ కౌర్(107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 109)సెంచరీలతో కదం తొక్కారు. 78 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును వీరిద్దరు ఆదుకున్నారు. సూపర్ బ్యాటింగ్తో నాలుగో వికెట్కు 184 పరుగులు జోడించి భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే హయ్యెస్ట్ స్కోర్గా నిలిచిన స్మృతి మంధానకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించగా.. ఆమె దాన్ని హర్మన్ప్రీత్తో కలిసి పంచుకుంది. ఇతరుల క్రెడిట్ను తమదని చెప్పుకునే ప్రస్తుత రోజుల్లో స్మృతి మంధాన తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను సహచర ప్లేయర్తో పంచుకోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంధాన గొప్ప మనసును కొనియాడుతున్నారు. ఇద్దరం కలిసే భారీ స్కోర్కు బాటలు వేసామని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇద్దరికి దక్కాలని ఈ సందర్భంగా స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. సెంచరీ చేసిన తర్వాత కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాకుంటే అది ఏ మాత్రం బావ్యం కాదనేది నా ఫీలింగ్. మా టీమ్ 300 ప్లస్ రన్స్ చేయడంలో మేం ఇద్దరం కీలక పాత్ర పోషించాం. సమానంగా రాణించాం. కాబట్టి ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇద్దరికి దక్కాలి. అందుకే ఈ ట్రోఫీని హర్మన్తో కలిసి పంచుకోవాలనుకుంటున్నా అని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది. స్మృతి నీది గొప్ప మనసు అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
Related News
Chiranjeevi: చిరంజీవి మేడే గ్రీటింగ్స్.. చైల్డ్ లేబర్ పై వీడియో షేరింగ్
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మే డే సందర్భంగా ప్రజలకు, అభిమానులకు, సినీ కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ యాడ్ వీడియోను పోస్ట్ చేశారు. బాలకార్మిక వ్యవస్థ అనే సామాజిక దురాచారాన్ని రూపుమాపడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ వో) చేస్తున్న ప్రచారం కోసం ఈ ప్రకటనను చిత్రీకరించినట్లు ఎక్స్ (ట్విట్టర్)లో చిరంజీవి ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ‘చిన్నిచేతులు’ ప�