PM Modi: నరేంద్ర మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు.. ఫొటోస్ వైరల్?
నేడు రక్షాబంధన్ కావడంతో దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షాబంధన్ వేడుక
- By Nakshatra Published Date - 03:39 PM, Wed - 30 August 23
నేడు రక్షాబంధన్ కావడంతో దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు రక్షాబంధన్ వేడుకలు జరుపుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా రక్షాబంధన్ వేడుకను జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా నరేంద్ర మోడీని ఢిల్లీ పాఠశాలల విద్యార్థులు నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అనంతరం పిల్లలందరూ కలిసి ఆయనకు రాఖీ కట్టారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ పిల్లలతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని ట్విట్టర్ ఖాతాలో బీజేపీ షేర్ చేసింది.
रक्षाबंधन के अवसर पर दिल्ली में स्कूल की छात्राओं ने प्रधानमंत्री श्री @narendramodi को राखी बांधी। pic.twitter.com/LnJawMexMq
— BJP (@BJP4India) August 30, 2023
అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ క్యాప్సిన్ కూడా జోడించారు. రక్షాబంధన్ ఒక పవిత్రమైన పండుగ. మన దేశ సంస్కృతికి ప్రతిరూపం. ఈ పండుగ ప్రజల జీవితాల్లో బంధాలు ఆప్యాయత సామరస్య భావాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్న అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Related News
Prajwal Rape Victims: ప్రజ్వల్ అత్యాచార బాధితులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సహాయం
జెడిఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు బలైన మహిళలకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా.