Andhra: ఏపీ బస్సులోని రూ. 4.76కోట్లు సీజ్
రూ.4.76 కోట్ల నగదును తరలిస్తోన్న ప్రయాణికుడి వద్ద ఉన్న రూ. 4.76కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- By CS Rao Published Date - 05:51 PM, Fri - 1 April 22
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా వద్ద ఓ ప్రైవేట్ బస్సులో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.4.76 కోట్ల నగదును తరలిస్తోన్న ప్రయాణికుడి వద్ద ఉన్న రూ. 4.76కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ప్లాజా వద్ద సాధారణ వాహనాల తనిఖీల్లో భారీగా నగదును పోలీసులు గుర్తించారు. ఒక ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్కు చెందిన బస్సు సీటు కింద ఆ నగదును గుర్తించారు. ఆ బస్సు విజయనగరం నుంచి గుంటూరు వెళ్తోంది. నగదుతో పాటు 350 గ్రాముల బంగారాన్ని కూడా ఆ ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఏడుగురు ప్రయాణికులను, బస్సు డ్రైవర్ మరియు క్లీనర్ను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. నగదు, బంగారం తీసుకెళ్తున్న ప్రయాణికులు అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించలేకపోయారు.
కర్నూలు జిల్లాలో ఇదే తరహాలో భారీ నగదు పట్టుబడిన నేపథ్యంలో ఈ విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని పంచలింగాల వద్ద మార్చి 24న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (SEB) రూ. 1.25 కోట్ల నగదును జప్తు చేసింది. హైదరాబాద్ నుండి కడప జిల్లా రాజంపేటకు నగదును తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే చెక్పోస్టు వద్ద మార్చి 6న ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికుల నుంచి రూ. 5 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ప్రయాణికుల నుంచి 8.250 కిలోల బంగారం, 28.5 కిలోల వెండి, నగదును SEB స్వాధీనం చేసుకుంది.
జనవరి 2020లో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నెల్లూరు యూనిట్ విజయవాడ రైల్వే స్టేషన్లో చెన్నై నుండి వరంగల్కు రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను విజయవాడ రైల్వే స్టేషన్లో పట్టుకుంది, వీరు బ్యాగులలో ప్యాకెట్లలో బంగారు కడ్డీలను తీసుకెళ్తున్నారు. డీఆర్ఐ తెలిపిన వివరాల ప్రకారం, తాము నగదును చెన్నైకి తరలించామని, అక్కడ అక్రమంగా తరలించిన విదేశీ బంగారం కొనుగోలు చేసి, లోహాన్ని స్మగ్లింగ్ కింగ్పిన్కు అప్పగించేందుకు తిరిగి వరంగల్కు వెళ్తున్నామని పోలీసులకు చెప్పారు. పట్టుబడిన బంగారం 7,228 గ్రాములు, విలువ రూ.3.05 కోట్లు. ఇటీవల తరచూ నగదు, బంగారంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణీకులు పట్టుబడుతున్నారు.
Related News
CM Revanth: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాట: సీఎం రేవంత్
CM Revanth: అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లడుతూ ఆర్టీసీ బలోపేతానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణ బద్దలై పనిచేస్తున్నది. ఆర్టీసీ మనది. తెలంగాణ ప్రజలందరిది. ఆర్టీసీకి గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా నాన్చుడు