Road Accident : అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాఠశాలకు వెళ్తుండగా విద్యార్థిని ఢీకొట్టిన లారీ
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాలకు వెళ్తుండగా హరిణి అనే విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు
- Author : Prasad
Date : 14-09-2023 - 5:01 IST
Published By : Hashtagu Telugu Desk
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాలకు వెళ్తుండగా హరిణి అనే విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఎనిమిదో తరగతి చదువుతున్న హరిణి అనే విద్యార్థిని తన తండ్రితో కలిసి బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో మృతి చెందింది. తన కూతురి తన కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం చూసిన తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. హరిణి మృతదేహాన్ని మార్చురీకి తరలించగా, ఆమె మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హరిణి మృతితో గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు దిగ్భ్రాంతికి గురైయ్యారు.